Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంట్లో విగతజీవిగా కనిపించిన మహిళా ప్రొఫెసర్ .. ఎక్కడ?

ఠాగూర్
శుక్రవారం, 11 జులై 2025 (23:05 IST)
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని జబల్‌పూర్‌లో విషాదకర ఘటన జరిగింది. 55 యేళ్ల మహిళా ప్రొఫెసర్ ఇంటిలో విగతజీవిపడివున్నారు. మృతురాలి పేరు ప్రజ్ఞా అగర్వాల్. తన నివాసంలోనే ఆమె విగతజీవిగా కనిపించారు. ఆమె ఇంట్లో పదునైన ఆయుధంతో కోసుకున్న గాయాలు, మెడపై కోతలు ఉండటంతో ఇది ఆత్మహత్యగా పోలీసులు భావిస్తున్నారు. అయితే, పోలీసులు మాత్రం దీన్ని అసాధారణ మరణంగా పేర్కొని కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. పూర్తి వివరాల మేరకు మృతదేహాన్ని శవపరీక్ష కోసం పంపించారు. 
 
శుక్రవారం పనిమనిషి ప్రజ్ఞా అగర్వాల్ ఇంటికి వచ్చి చూసేసరికి ఆమె విగతజీవిగా పడివున్నారు. వెంటనే ఆమె పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించగా ప్రజ్ఞా మణికట్టు, మెడపై లోతైనా గాయాలు ఉన్నట్టు గుర్తించారు. ఇంట్లో రక్తం మరకలు కూడా ఉన్నట్టు పోలీసులు తెలిపారు. 
 
ప్రాథమిక దర్యాప్తులో ఆత్మహత్య చేసుకున్నట్టు అనిపించినప్పటికీ అన్ని కోణాల నుంచి దర్యాప్తు జరుగుతోందని పోలీసులు పేర్కొన్నారు. ఆమెకు సంబంధించిన వ్యక్తులను విచారిస్తున్నామని, ఆమె ఇంట్లో లభించిన ఆధారాలను పరిశీలిస్తున్నామని తెలిపారు. గాయాలు ఆమె చేసుకున్నవేనా లేదా ఎవరైనా దాడి చేశారా అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments