Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైకాపా నేతను లారీతో ఢీకొట్టించి చంపిన దండగులు

Webdunia
శుక్రవారం, 23 సెప్టెంబరు 2022 (10:43 IST)
ప్రకాశం జిల్లా సింగరాయకొండలో దారుణం జరిగింది. అధికార వైకాపా నేతను కొందరు దుండగులు లారీతో ఢీకొట్టించి హత్య చేశారు. దీంతో స్థానికంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇవి హింసాత్మకంగా మారే అవకాశం ఉండటంతో అదనపు బలగాలను మొహరించారు. 
 
పాతకక్షల నేపథ్యంలో వైకాపా నేత పసుపులేటి రవితేజను కొందరు దండుగులు గురువారం  కొందరు దండగులు లారీతో ఢీకొట్టించి హత్య చేశారు. ఈ విషయం తెలియడంతో సింగరాయకొండలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నిందితులు హత్యకు ఉపయోగించిన లారీని స్వాధీనం చేసుకున్న పోలీసులు ఠాణాకు తరలించారు. 
 
మరోవైపు, తమ పార్టీ నేత హత్యకు నిరసంగా వైకాపా శ్రేణులు ఆందోళనకు దిగారు. వీరిపై పోలీసులు తమ లాఠీలను ఝుళిపించారు. దీంతో ఒక్కసారిగా పరిస్థితులు అదుపతప్పాయి. లారీకి నిప్పు పెట్టిన ఆందోళనకారులు పోలీస్ స్టేషన్‌కు ఎదురుగా ఉన్న చలివేంద్రాన్ని కూడా తగలబెట్టారు. ఈ ప్రాంతంలో డీఎస్పీ, సీఐ, ఎస్ఐలు బందోబస్తును నిర్వహిస్తున్నారు. వైకాపా నేతల ఆందోళనలు హింసాత్మకంగా మారకుండా గట్టి చర్యలు తీసుకున్నారు. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments