Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆస్తి కోసం కన్నతండ్రిని చంపేసిన కిరాతక తనయుడు

ఠాగూర్
మంగళవారం, 15 జులై 2025 (09:38 IST)
ఏపీలోని పల్నాడు జిల్లా ఈపూరులో దారుణం జరిగింది. ఆస్తి కోసం కన్నతండ్రినే హత్య చేశాడో కుమారుడు. తాడికొండ పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు... గ్రామానికి చెందిన వేల్పూరి శివయ్య (57) అనే వ్యక్తి ఈపూరు మండలం పొనుగోటివారి పాళెంలోన ఓ కోళ్లఫారంలో పనిచేస్తుంటారు. ఆయనకు భార్య, కుమారుడు నరేంద్ర, ఓ కుమార్తె ఉంది. కుమారుడుకి వివాహమైంది. ఆ తర్వాత కుటుంబంలో ఆస్తి గొడవలు మొదలయ్యాయి. దీంతో శివయ్య కుటుంబానికి దూరంగా ఉంటున్నారు. 
 
అప్పుడప్పుడూ గ్రామంలోని తల్లిని చూసేందుకు వస్తుంటారు. ఈ నెల 9న రాత్రి 8.30 సమయంలో గ్రామంలోనే వేరుగా ఉంటున్న భార్య, పిల్లల వద్దకు వెళ్లారు. ఈ క్రమంలో ఆయన పేరుపై ఉన్న 1.40 ఎకరం భూమి విషయంలో నరేంద్ర గొడవకు దిగాడు. ఆస్తి తనకు రాయకపోతే చంపేస్తానంటూ బెదిరించాడు. 
 
ఆ తర్వాత నిద్రిస్తున్న తండ్రిని గొంతు నులిమి హతమార్చాడు. నిందితుడిని సోమవారం అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరచగా.. రిమాండ్ విధించినట్లు సీఐ తెలిపారు. కాగా శివయ్య అనుమానాస్పద మృతిపై తల్లి అంజమ్మ ఫిర్యాదు మేరకు తాడికొండ పోలీసులు ఈ నెల 9న కేసు నమోదు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అభిమానులకు సర్‌ప్రైజ్‌లు ఇవ్వనున్న 'హరిహర వీరమల్లు'

Naga Chaitanya : ప్రియదర్శి, ఆనంది ల ప్రేమంటే లవ్లీ ఫస్ట్ లుక్

Kiran Abbavaram: K-ర్యాంప్ నుంచి గ్లింప్స్ రిలీజ్, రిలీజ్ డేట్ ప్రకటన

రొటీన్ కు భిన్నంగా పోలీస్ వారి హెచ్చరిక వుంటుంది : దర్శకుడు బాబ్జీ

Mr. Reddy : నా జీవితంలో జరిగిన కథే మిస్టర్ రెడ్డి : టీఎన్ఆర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

తర్వాతి కథనం
Show comments