హత్య కేసులో బెయిల్‌పై బయటకొచ్చి ఇద్దరిని హత్య చేసి లారీ డ్రైవర్!!

ఠాగూర్
సోమవారం, 27 జనవరి 2025 (18:20 IST)
భార్య, కుమార్తెను తనను వదిలి వెళ్లిపోవడానికి కారణమైందన్న కోపంతో ఓ మహిళను హత్య చేసిన లారీ డ్రైవర్, ఆ కేసులో బెయిల్‌పై బయటికొచ్చి ఆ మహిళ భర్త, ఆమె అత్తను కూడా హత్య చేసిన ఘటన కేరళ రాష్ట్రంలో వెలుగు చూసింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, పాలక్కాడ్ జిల్లాకు చెందిన 58 యేళ్ళ చెంతమార అనే వ్యక్తి లారీ డ్రైవరుగా పని చేస్తున్నాడు. 2019లో తన పక్కింట్లో ఉండే సజిత అనే మహిళను చెంతమార హత్య చేశాడు. భార్య, కుమార్తె తనను వదిలి వెళ్ళిపోవడానికి సజితనే కారణమని భావించి ఆమెపై కోపం పెంచుకుని ఈ దారుణానికి పాల్పడ్డాడు. ఈ కేసులో స్థానిక పోలీసులు ఆయనను అరెస్టు చేయగా, ఆ తర్వాత బెయిలుపై విడుదలయ్యాడు. 
 
ఆరు నెలల క్రితం జైలు నుంచి విడుదలైన చెంతమార.. తాజాగా సజిత భర్త సుధాకరన్ (54), ఆయన తల్లి లక్ష్మి (76)ని కూడా హత్య చేశాడు. చెంతమార జైలు నుంచి బయటకు వచ్చినపుడే ఏదైనా ఘాతుకానకి పాల్పడవచ్చని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. వారు అనుమానించినట్టుగానే చెంతమారు మరో ఇద్దరిని హత్య చేసి పరారీపోగా, కేసు నమోదు చేసి అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Premakatha Review : వినూత్నమైన ప్రేమ కథగా ప్రేమిస్తున్నా మూవీ రివ్యూ

Balakrishna: అఖండ 2: తాండవం నుంచి పవర్ ఫుల్ సాంగ్ ప్రోమో రిలీజ్

Samantha, బోయ్ ఫ్రెండ్ రాజ్ నిడిమోరును కౌగలించుకుని సమంత రూత్ ప్రభు ఫోటో

Shruti Haasan: అద్భుతమైన నాన్న అంటూ శ్రుతిహాసన్ ఎమోషనల్ పోస్ట్

Virat Karna: శివాలయం సెట్‌లో విరాట్ కర్ణపై నాగబంధం సాంగ్ షూటింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రపంచ మధుమేహ దినోత్సవం: రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడానికి కాలిఫోర్నియా బాదంపప్పులు

హ్యుందాయ్ హోప్ ఫర్ క్యాన్సర్ ద్వారా క్యాన్సర్ నుంచి సంరక్షణలో ముందడుగు

చిక్కుడు కాయలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఎంత?

ఆస్తమా రోగులు డ్రాగన్ ఫ్రూట్ తింటే...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

తర్వాతి కథనం
Show comments