Webdunia - Bharat's app for daily news and videos

Install App

అనాథాశ్రమంలో మైనర్ బాలికపై అత్యాచారం

Webdunia
బుధవారం, 26 అక్టోబరు 2022 (15:55 IST)
బాలికలపై జరుగుతున్న లైంగిక వేధింపులను అడ్డుకునేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో రకాలైన కఠిన చట్టాలు తీసుకొస్తున్నాయి. అయినప్పటికీ వారిపై జరుగుతున్న ఆగడాలు మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు. 
 
హైదరాబాద్ నగరంలో తాజాగా మైనర్ బాలిక అత్యాచారానికి గురైంది. డీఏవీ స్కూల్‌లో జరిగిన ఘటన మరిచిపోకముందే మరో ఘటన వెలుగులోకి వచ్చింది. ఇది సమాజంలో మహిళల భద్రతపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 
 
పోలీసు వర్గాల సమాచారం మేరకు.. మేడ్చల్ మల్కాజిగిరిలోని నేరేడ్‌మెట్‌లోని చిల్డ్రన్స్ హోమ్‌లో ఓ అనాథ బాలికపై అత్యాచారం జరిగింది. గ్రేస్ సోషల్ అండ్ ఎడ్యుకేషనల్ సొసైటీ నుంచి నలుగురు బాలికలు తప్పించుకోగా అందులో ఇద్దరు సంగారెడ్డిలో, ఇద్దరు బాలికలు సికింద్రాబాద్‌లో ఆశ్రయం పొందడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. 
 
సమాచారం అందుకున్న పోలీసులు, స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారులు వారికి కౌన్సెలింగ్ ఇచ్చారు. కౌన్సెలింగ్ సమయంలో, అకౌంటెంట్ మురళి తనపై అత్యాచారం చేసాడని బాధితురాలు అధికారులకు చెప్పింది. ఫిర్యాదు అందుకున్న పోలీసులు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

Adivi Sesh : డకాయిట్ డబ్బింగ్ టెస్ట్ పూర్తి చేసిన అడివి శేష్

మోగ్లీ 2025 కోసం 15 రోజుల భారీ క్లైమాక్స్ యాక్షన్ షెడ్యూల్‌ పూర్తి

వనాలు బాగుంటే జనాలు బాగుంటారనే కథతో కలివి వనం చిత్ర టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం