Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏడేళ్ల బాలిక అత్యాచార కేసులో ముద్దాయికి ఉరిశిక్ష : ఒంగోలు కోర్టు సంచలన తీర్పు

Webdunia
గురువారం, 26 జనవరి 2023 (10:35 IST)
ఏడేళ్ల బాలికపై అత్యాచారం చేసిన కేసులో ముద్దయిగా తేలిన వ్యక్తిన ఒంగోలు కోర్టు ఉరిశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ తీర్పు వివరాలను పరిశీలిస్తే, ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం అంబవరానికి చెందిన దూదేకుల సిద్ధయ్య గత 2021 జూలై 8వ తేదీన ఇంటి సమీపంలో ఆడుకుంటున్న కుమార్తె వరుసయ్యే ఏడేళ్ల కుమార్తె చిన్నారిని ఇంట్లోకి పిలిచి లైంగిక దాడికి తెగబడ్డాడు. 
 
ఆ బాలిక భయంతో కేకలు వేచయడంతో మంచానికేసి గట్టిగా కొట్టాడు. దీంతో ఆ బాలిక స్పృహ కోల్పోయింది. ఆపై ఆ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ క్రమంలో చిన్నారి చనిపోవడంతో మృతదేహాన్ని ఓ ప్లాస్టిక్ కవర్‌లో చుట్టి సైకిల్‌పై గ్రామ శివారు ప్రాంతానికి తీసుకెళ్లి పడేసి పారిపోయాడు. దీనిపై మృతురాలి తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు పరారీలో ఉన్న నిందితుడిని అరెస్టు చేశారు. 
 
ఈ కేసు విచారణ ఒంగోలు రెండో అదనపు జిల్లా సెషన్స్ జడ్జి, ఫోక్సో కోర్టు న్యాయమూర్తి ఎంఏ సోమశేఖర్ నిందితుడు సిద్ధయ్యను ముద్దాయిగా తేల్చుతూ ఆయన చనిపోయేంత వరకు ఉరితీయాలంటూ సంచలన తీర్పునిచ్చారు. అలాగే, బాధిత బాలికకు రూ.10 లక్షల పరిహారం అందించాలని ప్రభుత్వాన్ని ఆదేశించారు. కాగా, ఈ కేసులో నేరం జరిగిన 18 నెలల్లోనే దోషికి మరణశిక్ష పడిందని జిల్లా ఎస్పీ మలికా గార్గ్ వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సూర్య సేతుపతి హీరోగా పరిచయమవుతున్న మూవీ ఫీనిక్స్

కీర్తి సురేష్, సుహాస్ ఉప్పు కప్పురంబు మ్యూజిక్ ఆల్బమ్

SJ Surya: ఎస్‌జె సూర్య దర్శకత్వంలో శ్రీ గొకులం మూవీస్‌ టైటిల్ కిల్లర్

డ్రగ్స్ వ్యతిరేక ప్రచారాన్ని బాధ్యతగా తీసుకుంటా - విజయ్ దేవరకొండ

Rashmika : రష్మిక మందన్న పాన్ ఇండియా మూవీ మైసా ఫియర్స్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

తర్వాతి కథనం