Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లై ఏడాది: అమెరికాలో భర్త గుండెపోటుతో కన్నుమూత, తట్టుకోలేని భార్య ఆత్మహత్య

Webdunia
శుక్రవారం, 26 మే 2023 (19:25 IST)
ఫోటో కర్టెసి- సోషల్ మీడియా
హైదరాబాదులో విషాదకర ఘటన జరిగింది. తన భర్త మరణాన్ని తట్టుకోలేని వివాహిత ఆత్మహత్య చేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. వివరాలు ఇలా వున్నాయి. హైదరాబాదులోని వనస్థలిపురంకు చెందిన 31 ఏళ్ల మనోజ్ సాఫ్ట్వేర్ ఇంజినీరుగా అమెరికాలోని డల్లాస్‌లో పనిచేస్తున్నారు. ఏడాదిన్నర క్రితం అంబర్ పేటకు చెందిన 29 ఏళ్ల సాహితిని వివాహం చేసుకున్నాడు. వెంటనే తన భార్యను అమెరికాకు తీసుకుని వెళ్లాడు.
 
ఈ నెల మే నెల 2న తన తల్లిదండ్రులను చూసేందుకు హైదరాబాదు వచ్చింది సాహితి. మే నెల 20న డల్లాస్‌లో వున్న మనోజ్ తీవ్ర గుండెపోటుకి గురయ్యాడు. దీనితో అతడి స్నేహితులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఐతే చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మనోజ్ ప్రాణాలు కోల్పోయాడు. 23న అమెరికా నుంచి మనోజ్ భౌతిక కాయాన్ని హైదరాబాదుకి తీసుకుని వచ్చారు.
 
24న అంత్యక్రియలు నిర్వహించారు. అనంతరం సాహితి తన తల్లిదండ్రులతో కలిసి ఇంటికి చేరుకుంది. ఐతే భర్త మరణాన్ని తట్టుకోలేని సాహితి గురువారం ఉదయం వేళ ఇంట్లో ఫ్యానుకి ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. నిండునూరేళ్లు చల్లగా వుండాల్సిన జంట తిరిగిరాని లోకాలకు వెళ్లడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. సాహితి మరణంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments