ప్రేమ చంపేసింది: అమ్మా... ఈ రోజు ఆ గదిలో పడుకుంటానని చెప్పి...

Webdunia
సోమవారం, 23 ఆగస్టు 2021 (22:40 IST)
ఒన్ సైడ్ లవ్ అతడిని చంపేసింది. ఆమెను ప్రేమించానని చెప్పాడు. తనకు ఇష్టం లేదని సదరు యువతి ముఖం మీదే చెప్పేసింది. దాంతో అతడు ఇంట్లోనే ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
 
వివరాల్లోకి వెళితే... తిరుపతికి చెందిన నిరాజ్ తన తల్లిదండ్రులతో కలిసి ఎస్సార్ నగర్ లోని ఓ అపార్టుమెంటులో అద్దెకి వుంటున్నారు. నిరాజ్ సాఫ్ట్వేర్ ఇంజినీరుగా పనిచేస్తున్నాడు. కంపెనీలో విధులు నిర్వహించేందుకు వెళ్తున్న నిరాజ్ ఓ యువతి పట్ల ఆకర్షితుడయ్యాడు. తనను ప్రేమిస్తున్నట్లు ఆమెతో చెప్పాడు. ఆమె తనకు ఇష్టంలేదని చెప్పేసింది. ఆమె నిరాకరించిందని తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు.
 
ఆదివారం రాత్రి తన తల్లిదండ్రులతో తను వేరే గదిలో నిద్రపోతానని చెప్పాడు. అలా నిద్రపోయిన నిరాజ్‌ను ఉదయాన్నే నిద్ర లేపేందుకు తండ్రి ప్రయత్నించాడు. కానీ ఎంతకీ అతడు నిద్రలేవపోయేసరికి గదిలో అంతా కలియ చూడగా పక్కనే సైనైడ్ బాటిల్ లభ్యమైంది. సెల్ ఫోన్ చూడగా అందులో ఓ యువతి ఫోటో వుంది. ఆమెను తను ప్రేమించానని, నిరాకరించడంతో సూసైడ్ చేసుకుంటున్నట్లు సెల్ఫీ వీడియోలో తెలిపాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నారా రోహిత్, శిరీష ప్రీ - వెడ్డింగ్ వేడుకలు ప్రారంభం.. పెళ్లి ముహూర్తం ఎప్పుడంటే?

Devi Sri Prasad: ఈసారైనా దేవీశ్రీ ప్రసాద్ హీరోగా క్లిక్ అవుతాడా, కీర్తి సురేష్ జంటగా చేస్తుందా...

Rahul: హాస్టల్లో ఉండే రోజుల్లో ది గర్ల్ ఫ్రెండ్ ఐడియా వచ్చింది: రాహుల్ రవీంద్రన్

ఉపాసన సీమంతంలో అల్లు అర్జున్ ఎక్కడ? ఎందుకు పక్కనబెట్టారు?

దేవ్ పారు నుంచి కాలభైరవ పాడిన నా ప్రాణమంత సాంగ్ లాంచ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments