ప్రేమ చంపేసింది: అమ్మా... ఈ రోజు ఆ గదిలో పడుకుంటానని చెప్పి...

Webdunia
సోమవారం, 23 ఆగస్టు 2021 (22:40 IST)
ఒన్ సైడ్ లవ్ అతడిని చంపేసింది. ఆమెను ప్రేమించానని చెప్పాడు. తనకు ఇష్టం లేదని సదరు యువతి ముఖం మీదే చెప్పేసింది. దాంతో అతడు ఇంట్లోనే ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
 
వివరాల్లోకి వెళితే... తిరుపతికి చెందిన నిరాజ్ తన తల్లిదండ్రులతో కలిసి ఎస్సార్ నగర్ లోని ఓ అపార్టుమెంటులో అద్దెకి వుంటున్నారు. నిరాజ్ సాఫ్ట్వేర్ ఇంజినీరుగా పనిచేస్తున్నాడు. కంపెనీలో విధులు నిర్వహించేందుకు వెళ్తున్న నిరాజ్ ఓ యువతి పట్ల ఆకర్షితుడయ్యాడు. తనను ప్రేమిస్తున్నట్లు ఆమెతో చెప్పాడు. ఆమె తనకు ఇష్టంలేదని చెప్పేసింది. ఆమె నిరాకరించిందని తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు.
 
ఆదివారం రాత్రి తన తల్లిదండ్రులతో తను వేరే గదిలో నిద్రపోతానని చెప్పాడు. అలా నిద్రపోయిన నిరాజ్‌ను ఉదయాన్నే నిద్ర లేపేందుకు తండ్రి ప్రయత్నించాడు. కానీ ఎంతకీ అతడు నిద్రలేవపోయేసరికి గదిలో అంతా కలియ చూడగా పక్కనే సైనైడ్ బాటిల్ లభ్యమైంది. సెల్ ఫోన్ చూడగా అందులో ఓ యువతి ఫోటో వుంది. ఆమెను తను ప్రేమించానని, నిరాకరించడంతో సూసైడ్ చేసుకుంటున్నట్లు సెల్ఫీ వీడియోలో తెలిపాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హైదరాబాద్‌లో సరికొత్త ఫార్మెట్ లో ఐమాక్స్ స్క్రీన్ : సునీల్ నారంగ్

Sandigdham Review: మిస్టరీ, థ్రిల్లింగ్ కథతో నిహాల్, ప్రియా దేశ్‌పాగ్ చిత్రం సందిగ్ధం మూవీ రివ్యూ

Sanjay Rao: హిట్ అండ్ రన్ ఫస్ట్ లుక్ తో సంజయ్ రావ్ క్రేజ్

మహేష్ బాబు అతిథి 4K థియేటర్లలో పాలాబిషేకంతో అభిమానుల సందడి

Sandeep Reddy Vanga: సందీప్ రెడ్డి వంగా చిత్రానికి రోమాంచకం టైటిల్ ఖరారు

తర్వాతి కథనం
Show comments