Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేపీహెచ్‌బీలో గుర్తుతెలియని మృతదేహం కలకలం - కాల్చి చంపారా?

Webdunia
సోమవారం, 24 అక్టోబరు 2022 (15:31 IST)
హైదరాబాద్ నగరంలోని కూకట్‌పల్లి కేపీహెచ్‌బీ కాలనీలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం కలకలం రేపింది. ఓ యువకుడిని చంపేసి శవాన్ని తగులబెట్టారు. గుర్తు తెలియని దుండగులు చేసిన ఈ దారుణమైన పనికి స్థానికులు భయభ్రాంతులకు గురవుతున్నారు. 
 
హైదర్ నగరులోని అలీ తలాబ్ శ్మశాన వాటిక వద్ద గుర్తు తెలియని శవం మంటల్లో కాలుతూ ఉండటాన్ని స్థానికులు గుర్తించి భయాందోళనకు గురయ్యారు. ఎవరినో హత్య చేసి శ్మశానవాటికలో నిప్పంటించి హత్య చేస్తున్నట్టు పోలీసులకు సమాచారం అందించారు. 
 
పైగా, ఈ నెల 25వ తేదీన అమావాస్యతో పాటు సూర్యగ్రహణం కావడంతో బలిచ్చి ఉండొచ్చని  స్థానుకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పరిసర ప్రాంతాల్లో క్షుద్రపూజలు జరిగినట్టు ఆనవాళ్లు కనిపించడంతో క్షుద్రపూజలు చేసి బలిచ్చి, శవాన్ని కాల్చివేశారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతి చెందిన యువకుడు ఎవరు అన్నది ఆరా తీస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల కోసం పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇంజనీర్ ఓ అమ్మాయి ప్రేమలో పడితే ఏమయిందంటే... ప్రదీప్ మాచిరాజు

Kalyan Ram: అమ్మల కోసం త్యాగం చేయాలి, అందుకే ఈ సినిమాని అమ్మలకు అంకితం : కళ్యాణ్ రామ్

పెళ్ళికి సిద్ధమవుతున్న చెన్నై చంద్రం?

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments