Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నోట్లో గుడ్డలు కుక్కి.. నర్సుపై సామూహిక అత్యాచారం... ఎక్కడ?

victim
, సోమవారం, 24 అక్టోబరు 2022 (12:39 IST)
ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలో దారుణం జరిగింది. నర్సును కట్టేసి నోట్లో గుడ్డలు కుక్కిన నలుగురు కామాంధులు సామూహిక అత్యాచారానికి తెగబడ్డారు. వీరిలో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేయగా, మరో నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ నలుగురు నిందితుల్లో ఒకరు మైనర్ బాలుడు కావడం గమనార్హం. 
 
రాష్ట్రంలోని మహేంద్రగఢ్ జిల్లా ఛిప్‌చిపీ గ్రామంలో ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రం ఉంది. ఈ హెల్త్ సెంటరులో నర్సు ఒంటరిగా ఉందని గమనించిన నలుగురు దుండగులు అదే దావఖానలోకి చొరబడి ఆమెను కట్టేశారు. ఆ తర్వాత ఆమె అరవకుండా నోట్లో గుడ్డలు కుక్కారు. తర్వాత నలుగురు కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. దీన్నంతా వీడియో తీశారు. ఎవరికైనా చెప్తే చంపేస్తామని నర్సును బెదిరించారు. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతాల్లో ఈ దారుణం జరిగింది. 
 
దీనిపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి నిందితుల్లో ముగ్గురిని అరెక్టు చేశారు. మరో నిందితుడు పరారీలో ఉన్నాడు. నలుగురు కామాంధుల్లో ఒకరు 17 యేళ్ల మైనర్ బాలుడు కావడం గమనార్హం. ఈ ఘటనపై ఆరోగ్య కార్యకర్తలు, నర్సులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమకు భద్రత కల్పించాలని వారు కోరుతున్నారు. "మాకు భద్రత కావాలి. నిందితులను కఠినంగా శిక్షించకపోతే మేం విధులకు హాజరుకాబోము" అని చీఫ్ హెల్త్ ఆఫీసర్ ప్రతిమా సింగ్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కోయంబత్తూరులో కారు బాంబు పేలుడు - చెన్నై ఎయిర్‌‍పోర్టులో హైఅలెర్ట్