Webdunia - Bharat's app for daily news and videos

Install App

సంచలనం రేపుతున్న విద్యార్థిని రితీసాహు మృతి కేసు

Webdunia
ఆదివారం, 27 ఆగస్టు 2023 (17:18 IST)
ఇటీవల విశాఖపట్టణంలో అనుమానాస్పదంగా మృతి చెందిన ఇంటర్ విద్యార్థిని రితీ సాహు కేసు ఇపుడు సంచలనంగా మారింది. ఈ మృతిపై ఉన్న మిస్టరీని ఛేదించేందుకు సీఐడీని ఆదేశించినట్టు తెలుస్తుంది. దీంతో వెస్ట్ బెంగాల్ సీఐడీ పోలీసులు రంగంలోకి దిగారు. 
 
గత నెల 14వ తేదీన రితీసాహు భవనంపై నుంచి కిందపడి ప్రాణాలు కోల్పోయారు. ఈమె స్వస్థలం వెస్ట్ బెంగాల్. ఈ ఘటనపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పైగా, ఈ మృతిపై విశాఖ పోలీసుల తీరుపై మృతురాలి తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేశారు. నాలుగో పట్టణ పోలీసులు కేసును తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని వారు ఆరోపించారు. 
 
హాస్టల్ యాజమాన్యం నుంచి లంచం తీసుకుని కేసును తప్పుదారి పట్టిస్తున్నారంటూ మండిపడ్డారు. ఈ ఆరోపణలకు బలం చేకూర్చేలా సీసీటీవీ ఫుటేజీలోని లొసుగులపై నాలుగో పట్టణ సీఐపై బదిలీ వేటు పండింది. దీంతో ఈ కేసులో నాలుగో పట్టణ పోలీసుల వద్ద వెస్ట్ బెంగాల్ సీఐడీ పోలీసులు విచారణ జరుపనున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akhanda 2 teaser: హిమాలయాల్లో అఖండ 2 – తాండవం ఊచకోత టీజర్ అదుర్స్

పబ్లిసిటీ శ్రుతి తప్పడంతో నిర్మాత సునీల్‌ నారంగ్‌ ఛాంబర్ పదవికి ఎసరు !

హీరో కార్తి, పిఎస్ మిత్రన్ సర్దార్ 2 షూటింగ్ పూర్తి

బ్రోకోడ్ చిత్రంతో హీరోగా, నిర్మాతగా రవి మోహన్

Manchu: ప్రభాస్ నాకోసం చేయలేదు. అతనికి చేయాల్సిన అవసరం లేదు : మంచు విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments