Webdunia - Bharat's app for daily news and videos

Install App

మూడు లక్ష్యాల్లో రెండింటిని పూర్తి చేసిన చంద్రయాన్-3 : ఇస్రో ట్వీట్

Webdunia
ఆదివారం, 27 ఆగస్టు 2023 (16:31 IST)
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో చేపట్టిన చంద్రయాన్-3 ప్రయోగం విజయవంతమైంది. చంద్రుడి దక్షిణ ధృవంపై విక్రమ్ ల్యాండ్ రోవర్‌ను సాఫ్ట్ ల్యాండింగ్‌ ద్వారా మద్దాడేలా చేసింది. దీనిపై ఇస్రో తాజాగా ఓ ట్వీట్ చేసింది. ఇప్పటివరకు చంద్రయాన్-3 మూడు లక్ష్యాల్లో రెండింటిని పూర్తి చేసిందని తెలిపింది. సాఫ్ట్ ల్యాండింగ్, జాబిల్లిపై రోవర్ సంచారం విజయవంతంగా ముగిసిననట్టు తెలిపింది. ప్రస్తుతం జాబిల్లిపై ప్రయోగాలు జరుగుతున్నాయని వెల్లడించింది. రోవర్‌లో ఉన్న అని వ్యవస్థలు సాఫీగా పని చేస్తున్నాయని సోషల్ మీడియాలో ఓ పోస్ట్ ద్వారా వెల్లడించింది. 
 
"చంద్రుడిపై విక్రమ్ ల్యాండర్ సాఫ్ట్ ల్యాండింగ్ చేయడం, జాబిల్లి ఉపరితలంపై ప్రజ్ఞాన్ రోవర్ సంచరించడం దిగ్విజయంగా పూర్తయింద"ని తెలిపింది. చంద్రయాన్-3 మిషన్‌లో భాగంగా, జాబిల్లి ఉపరితలంపై ప్రస్తుతం పలు ప్రయోగాలు జరుగుతున్నాయని, అన్ని వ్యవస్థలూ ఆశించిన స్థాయిలో పనితీరును కనబరుస్తున్నాయని ప్రకటించింది. ఇస్రో చేపట్టిన చంద్రయాన్-3 మిషన్‌తో భారత్ జాబిల్లి దక్షిణ ధృవంపై వ్యోమనౌక నిలిపిన తొలి దేశంగా బుధవారం ఓ అరుదైన రికార్డున సృష్టించిన విషయం తెలిసిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Atharva: మై బేబీ సినిమా రికార్డు స్థాయిలో దూసుకుపోతోంది

Varun tej: వరుణ్ తేజ్ 15వ చిత్రానికి థమన్ మ్యూజిక్ సిట్టింగ్

పెద్ద హీరోలతో నో యూజ్... చిన్న హీరోలతో నటిస్తేనే మంచి పేరు : నిత్యా మీనన్

రిషబ్ శెట్టి కాంతార చాప్టర్ 1 షూటింగ్ పూర్తి, మూడేళ్ళ మేకింగ్ వీడియో

మాడ్యులేషన్‌లో ఏ డైలాగ్ అయినా చెప్పగలిగే గొప్ప నటుడు కోట శ్రీనివాసరావు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments