మూడు లక్ష్యాల్లో రెండింటిని పూర్తి చేసిన చంద్రయాన్-3 : ఇస్రో ట్వీట్

Webdunia
ఆదివారం, 27 ఆగస్టు 2023 (16:31 IST)
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో చేపట్టిన చంద్రయాన్-3 ప్రయోగం విజయవంతమైంది. చంద్రుడి దక్షిణ ధృవంపై విక్రమ్ ల్యాండ్ రోవర్‌ను సాఫ్ట్ ల్యాండింగ్‌ ద్వారా మద్దాడేలా చేసింది. దీనిపై ఇస్రో తాజాగా ఓ ట్వీట్ చేసింది. ఇప్పటివరకు చంద్రయాన్-3 మూడు లక్ష్యాల్లో రెండింటిని పూర్తి చేసిందని తెలిపింది. సాఫ్ట్ ల్యాండింగ్, జాబిల్లిపై రోవర్ సంచారం విజయవంతంగా ముగిసిననట్టు తెలిపింది. ప్రస్తుతం జాబిల్లిపై ప్రయోగాలు జరుగుతున్నాయని వెల్లడించింది. రోవర్‌లో ఉన్న అని వ్యవస్థలు సాఫీగా పని చేస్తున్నాయని సోషల్ మీడియాలో ఓ పోస్ట్ ద్వారా వెల్లడించింది. 
 
"చంద్రుడిపై విక్రమ్ ల్యాండర్ సాఫ్ట్ ల్యాండింగ్ చేయడం, జాబిల్లి ఉపరితలంపై ప్రజ్ఞాన్ రోవర్ సంచరించడం దిగ్విజయంగా పూర్తయింద"ని తెలిపింది. చంద్రయాన్-3 మిషన్‌లో భాగంగా, జాబిల్లి ఉపరితలంపై ప్రస్తుతం పలు ప్రయోగాలు జరుగుతున్నాయని, అన్ని వ్యవస్థలూ ఆశించిన స్థాయిలో పనితీరును కనబరుస్తున్నాయని ప్రకటించింది. ఇస్రో చేపట్టిన చంద్రయాన్-3 మిషన్‌తో భారత్ జాబిల్లి దక్షిణ ధృవంపై వ్యోమనౌక నిలిపిన తొలి దేశంగా బుధవారం ఓ అరుదైన రికార్డున సృష్టించిన విషయం తెలిసిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Zee 5: ది గ్రేట్‌ ప్రీ వెడ్డింగ్ షో స్ట్రీమింగ్‌ జీ 5 లో రాబోతోంది

Raju Weds Rambai Review: నిఖార్సయిన ప్రేమకథగా రాజు వెడ్స్ రాంబాయి రివ్యూ

12A Railway Colony Review,: అల్లరి నరేష్ కు 12ఏ రైల్వే కాలనీ గట్టెక్కించేలా? 12ఏ రైల్వే కాలనీ రివ్యూ

Premante Review: గాడి తప్పిన ప్రియదర్శి, ఆనంది ల ప్రేమ.. ప్రేమంటే రివ్యూ

Sai Pallavi: పూజా హెగ్డేకు బ్యాడ్ లక్.. సాయిపల్లవికి ఆ ఛాన్స్..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments