Webdunia - Bharat's app for daily news and videos

Install App

మూడు లక్ష్యాల్లో రెండింటిని పూర్తి చేసిన చంద్రయాన్-3 : ఇస్రో ట్వీట్

Webdunia
ఆదివారం, 27 ఆగస్టు 2023 (16:31 IST)
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో చేపట్టిన చంద్రయాన్-3 ప్రయోగం విజయవంతమైంది. చంద్రుడి దక్షిణ ధృవంపై విక్రమ్ ల్యాండ్ రోవర్‌ను సాఫ్ట్ ల్యాండింగ్‌ ద్వారా మద్దాడేలా చేసింది. దీనిపై ఇస్రో తాజాగా ఓ ట్వీట్ చేసింది. ఇప్పటివరకు చంద్రయాన్-3 మూడు లక్ష్యాల్లో రెండింటిని పూర్తి చేసిందని తెలిపింది. సాఫ్ట్ ల్యాండింగ్, జాబిల్లిపై రోవర్ సంచారం విజయవంతంగా ముగిసిననట్టు తెలిపింది. ప్రస్తుతం జాబిల్లిపై ప్రయోగాలు జరుగుతున్నాయని వెల్లడించింది. రోవర్‌లో ఉన్న అని వ్యవస్థలు సాఫీగా పని చేస్తున్నాయని సోషల్ మీడియాలో ఓ పోస్ట్ ద్వారా వెల్లడించింది. 
 
"చంద్రుడిపై విక్రమ్ ల్యాండర్ సాఫ్ట్ ల్యాండింగ్ చేయడం, జాబిల్లి ఉపరితలంపై ప్రజ్ఞాన్ రోవర్ సంచరించడం దిగ్విజయంగా పూర్తయింద"ని తెలిపింది. చంద్రయాన్-3 మిషన్‌లో భాగంగా, జాబిల్లి ఉపరితలంపై ప్రస్తుతం పలు ప్రయోగాలు జరుగుతున్నాయని, అన్ని వ్యవస్థలూ ఆశించిన స్థాయిలో పనితీరును కనబరుస్తున్నాయని ప్రకటించింది. ఇస్రో చేపట్టిన చంద్రయాన్-3 మిషన్‌తో భారత్ జాబిల్లి దక్షిణ ధృవంపై వ్యోమనౌక నిలిపిన తొలి దేశంగా బుధవారం ఓ అరుదైన రికార్డున సృష్టించిన విషయం తెలిసిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

Siddu: జాక్ తో బొమ్మరిల్లు భాస్కర్ ట్రబుల్ లో పడ్డాడా?

Raviteja: మాస్ జాతర లో రవితేజ చిత్రం రీమిక్స్ థీమ్ విడుదల

థియేటర్లో నవ్వుతుంటే మా కడుపు నిండిపోయింది : ప్రదీప్ మాచిరాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments