Webdunia - Bharat's app for daily news and videos

Install App

అత్యాచారాన్ని ప్రతిఘటించిన బాలిక నోట్లో యాసిడ్‌ పోసిన ఉన్మాది.. ఎక్కడ?

Webdunia
మంగళవారం, 6 సెప్టెంబరు 2022 (09:10 IST)
జిల్లా కేంద్రమైన నెల్లూరులో దారుణం జరిగింది. అత్యాచారాన్ని ప్రతిఘటించిన బాలికను పట్టుకుని నోట్లో యాసిడ్ పోసిన ఓ ఉన్మాది ఆ తర్వాత కత్తితో గొంతు కోశాడు. తన ఇంట్లో బాలిక ఒంటరిగా ఉన్న సమయంలో ఈ దారుణం జరిగింది. 
 
జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్న వెంకటాచలం మండలంలోని ఓ గ్రామానికి చెందిన ఓ బాలిక స్థానికంగా ఉండే ప్రభుత్వ పాఠశాలలో 9వ తరగతి చదువుతోంది. ఆ బాలికను ఇంట్లోనే ఉంచి తల్లిదండ్రులు సోమవారం సాయంత్రం బజారుకు వెళ్లారు. 
 
బాలిక ఒంటరిగా ఉండటాన్ని గమనించిన నాగరాజు అనే వ్యక్తి ఇంట్లోకి ప్రవేశించి ఆమెపై అత్యాచారానికి యత్నించాడు. దీంతో ఆ బాలిక ప్రతిఘటించి తప్పించుకునే ప్రయత్నం చేసింది. అయితే, ఆ బాలికను చెరబట్టిన ఉన్మాది ఆమెను గట్టిగా పట్టుకుని నోట్లో యాసిడ్ పోశాడు. దీంతో నొప్పి భరించలేకు బాలిక పెద్దగా కేకలు వేయడంతో గొంతుకోసి పరారయ్యాడు. 
 
ఆ బాలిక అరుపులు విన్న ఇరుగుపొరుగువారు వచ్చి జరిగిన ఘాతుకాన్ని చూసి తల్లిదండ్రులకు సమాచారం చేరవేశారు. వారొచ్చి రక్తపుమడుగులో ఉన్న తమ బిడ్డను నెల్లూరులోని ఓ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆ బాలికను మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి, జిల్లా ఎస్పీ విజయరామారావులు పరామర్శించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ఉన్మాదిని అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సీఎం పెళ్లాం సమాజానికి మంచి చేయాలనుకుంటే ఏమైంది ?

రెండు మతాల మధ్య చిచ్చు పెట్టిన గొర్రె కథతో గొర్రె పురాణం ట్రైలర్

ఫ్యామిలీ ఆడియెన్స్ ను దృష్టిలో పెట్టుకుని చంద్రహాస్ తో రామ్ నగర్ బన్నీ తీసా : ప్రభాకర్

దుబాయ్‌లో సుబ్రహ్మణ్య- బియాండ్ ఇమాజినేషన్ చిత్రం గ్లింప్స్ రిలీజ్

కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టిన మేఘా ఆకాశ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యానికి 5 తులసి ఆకులు, ఏం చేయాలి?

చికాగోలో నాట్స్ హైవే దత్తత కార్యక్రమం

బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఎక్స్‌క్లూజివ్ ఐవేర్ కలెక్షన్‌

ప్రతిరోజూ బాదం పప్పును తింటే ప్రయోజనం ఏంటి?

ప్రతిరోజూ ఉదయాన్నే ఉసిరి తింటే..!

తర్వాతి కథనం
Show comments