Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫోన్ చోరీ చేసిందని అట్లకాడ కాల్చి వాతపెట్టారు...

ఠాగూర్
సోమవారం, 23 జూన్ 2025 (11:10 IST)
ఫోన్ దొంగిలించిందన్న నెపంతో ఓ చిన్నారిని చిత్రహింసలకు గురిచేశారు. జ్యోతిష్యుడు చెప్పిన మాటలు నమ్మి... అట్లకాడ కాల్చి చిన్నారికి వాతలు పెట్టారు. తనకు తెలియదని మొత్తుకున్నప్పటికీ ఏమాత్రం వినకుండా చిత్రహింసలకు గురిచేశారు. ఈ అమానుష ఘటన శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కుడితిపాళెం గ్రామం కాకర్లదిబ్బలో జరిగింది. 
 
పోలీసుల కథనం మేరకు... పదేళ్ల చిన్నారికి తల్లిదండ్రులు లేకపోవడంతో ఆమె మేనత్త మాణికల మన్నారి తీసుకొచ్చి పెంచుకుంటుందోంది. ఆ బాలిక పొరిగింట్లో ఉన్న నాగరాజు అనే వ్యక్తి ఫోన్ శనివారం పోయింది. దీంతో ఆయన జ్యోతిష్యుడి వద్దకు వెళ్ళగా పక్కింటిలో ఉన్న చిన్నారి చోరీ చేసిందని చెప్పాడు. 
 
వెంటనే నాగరాజు ఆయన భార్య సుబ్బమ్మ, చుట్టుపక్కలవారైన శ్రీనివాసులు, సార్ముడమ్మ, మన్నారిలు అనుమానంతో ఆ బాలికను లాక్కెళ్లి పొయ్యివద్ద పడకోబెట్టి, అట్లకాడ కాల్చి వాతలుపెట్టారు. మూతి, నాలుకు, చేతులపై ఈ వాతలు పెట్టారు. ఆదివారం స్థానికులు గమనించి 112 ఫోన్ చేసి చెప్పడంతో ఎస్ఐ నాగార్జున రెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని చిన్నారిని ఆస్పత్రిలో చేర్పించాడు. చిన్నారిని చిత్రహింసలకు గురిచేసినందుకు కేసు నమోదు చేసి మొత్తం ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. కేసు దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dhanush: దర్శకుడు నిర్మాత మొహాల్లో నువ్వు చూడడం చాలా ఆనందంగా ఉంది : ధనుష్

బ్రెయిన్ ఎన్యోరిజమ్‌ సమస్యతో బాధపడుతున్న సల్మాన్ ఖాన్!! (Video)

నా మనసుకు చేరువైన పాత్ర ఏదీ లేదు : పవన్ కళ్యాణ్

హీరో విజయ్ దేవరకొండపై అట్రాసిటీ కేసు

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments