Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పద్మావతి ఎక్స్‌ప్రెస్‌లో దొంగల బీభత్సం

Advertiesment
train

ఠాగూర్

, శనివారం, 21 జూన్ 2025 (14:59 IST)
నెల్లూరు జిల్లాలో దొంగలు రెచ్చిపోయారు. పద్మావతి ఎక్స్‌ప్రెస్ రైలులో దొంగలుపడ్డారు. శనివారం ఈ దోపిడీ జరిగింది. నెల్లూరు జిల్లా కావలి - వెంకటేశ్వరపాలెం మధ్య ప్రయాణిస్తున్నపుడు ఈ సంఘటన జరిగింది.
 
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి పద్మావతి ఎక్స్‌ప్రెస్ తిరుపతికి బయలుదేరింది. ఈ రైలు, కావలి స్టేషన్ దాటిన తర్వాత వేంకటేశ్వర పాలెం సమీపంలోని రాగానే గుర్తు తెలియని దుండగులు రైలులోని మూడు బోగీల్లోకి ప్రవేశించారు
 
నిద్రపోతున్న ముగ్గురు మహిళా ప్రయాణికుల మెడలో నుంచి సుమారు 40 గ్రాముల బంగారు ఆభరణాలు లాక్కెళ్లారు. వారివద్ద ఉన్న రూ.20 వేల నగదు, మొబైల్ ఫోన్ కూడా అపహరించారు. తెల్లవారుజామున జరిగిన ఈ హఠాత్ పరిణామంతో ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు. 
 
దోడిపీ అనంతరం దొంగలు రైలు నుంచి దూకి పారిపోయారు. బాధితులు వెంటనే రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేయగా, వారు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

School bus: సైకిల్‌పై రోడ్డుపైకి బాలుడు... స్కూల్ బస్సు టైర్ కిందపడి మృతి (video)