చేతబడి చేస్తున్నారనీ.. ఐదుగురిని కొట్టి చంపేశారు...

ఠాగూర్
మంగళవారం, 8 జులై 2025 (08:41 IST)
బీహార్ రాష్ట్రంలో దారుణం జరిగింది. మూఢ నమ్మకం పేరుతో ఓ కుటుంబంలోని ఐదుగురు వ్యక్తులను కొట్టి చంపేశారు. ఆ తర్వాత శవాలను దహనం చేశారు. ఈ దారుణ ఘటన పూర్ణియా జిల్లాలోని ఓ గిరిజన గ్రామంలో ఆదివారం జరిగింది. ఆ తర్వాత నిందితులు భయంతో గ్రామం విడిచి పారిపోయారు. దీంతో గ్రామం మొత్తం నిర్మానుష్యంగా మారింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
గ్రామంలో ఇటీవల కొందరు అనారోగ్యంతో మరణించారు. దీనికి బాబులాల్ ఓరాన్ కుటుంబం చేస్తున్న క్షుద్రపూజలే కారణమని గ్రామస్థులు అనుమానించారు. ఈ అనుమానం పెరిగిపోవడంతో ఆదివారం ఒక్కసారిగా ఆ కుటుంబంపై దాడికి దిగారు. బాబులాల్ ఓరాన్, సీతా దేవి, మంజీత్ ఓరాన్, రానియా దేవి, తప్తో మోస్మత్‌లను కర్రలతో కొట్టి చంపి, ఆ తర్వాత వారి మృతదేహాలకు నిప్పంటించారు. 
 
ఈ దారుణంపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, సమీపంలోని చెరువు నుంచి దగ్ధమైన మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘోర దాడి నుంచి ఆ కుటుంబానికి చెందిన ఓ బాలుడు ప్రాణాలతో బయటపడ్డాడు. గ్రామస్థులందరూ కలిసి తన కుటుంబ సభ్యులను చంపారని ఆ బాలుడు పోలీసులకు తెలిపాడు. 
 
అయితే, బాలుడు తీవ్ర భయాందోళనలో ఉండటంతో పోలీసులు ఇంకా పూర్తి వివరాలు సేకరించలేదని, అందుకే ఎఫ్ఎస్ఐఆర్ నమోదు చేయలేదని తెలిసింది. జనాలను రెచ్చగొట్టాడన్న ఆరోపణలపై నకుల్ కుమార్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ హత్యల వెనుక మంత్రతంత్రాలు, క్షుద్రపూజలే కారణమని పూర్ణియా ఎస్పీ స్వీటీ సెహ్రావత్ ధృవీకరించారు. ప్రస్తుతం గ్రామంలో డాగ్ స్క్వాడ్‌తో పోలీసులు గస్తీ కాస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ram Gopal Varma: రాంగోపాల్ వర్మ.. షో మ్యాన్..మ్యాడ్ మాన్స్టర్

Shivaj :ఓవర్సీస్ ప్రీమియర్లతో సిద్ధం చేస్తున్న ధండోరా

Dhanush: కృతి స‌న‌న్ తో ప్రేమలో మోసపోయాక యుద్ధమే అంటున్న ధనుష్ - అమ‌ర‌కావ్యం (తేరే ఇష్క్ మై)

అఖండ 2 డిసెంబర్ 12న వస్తోందా నిర్మాతలు ఏమన్నారంటే?

'అఖండ్-2' ప్రీమియర్ షోలు రద్దు.. ఎందుకో తెలుసా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

తర్వాతి కథనం
Show comments