Webdunia - Bharat's app for daily news and videos

Install App

వందేభారత్ రైలులో విండో సీటు ఇవ్వలేదని పిచ్చకొట్టుడు కొట్టిన ఎమ్మెల్యే మనుషులు, రక్తం కారింది

ఐవీఆర్
శనివారం, 21 జూన్ 2025 (17:08 IST)
ఇటువంటివి రైలు ప్రయాణంలో కొన్నిసార్లు చూస్తుంటాం. కొన్నిరోజులు ముందుగానే ప్రయాణం సౌకర్యవంతంగా వుండాలని కొంమంది ప్రత్యేకించి విండో సీట్ రిజర్వ్ చేసుకుంటారు. కానీ అదేమీ పట్టించుకోని ఇంకొందరు రిజర్వ్ చేసి వున్నా కూడా విండో సీటుని ఆక్రమించేసి, ఆ సీట్లో కూర్చోండి, వేరే బోగీలో వున్న మా కుటుంబ సభ్యుడి సీట్లో కూర్చోండి అని చెప్పేస్తారు. దానితో చాలామంది ఏంచేయాలో తోచక తమ సీటు తమకి ఇచ్చేయాలని గట్టిగా చెప్పేస్తుంటారు. దాంతో పరస్పర వాగ్వాదానికి దారి తీస్తుంది.
 
ఇట్లాంటి ఘటనే ఢిల్లీ-భోపాల్ వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైలులో జరిగింది. ఓ వ్యక్తి తను కూర్చున్న విండో సీటు తమకు ఇవ్వలేదన్న కోపంతో ఎమ్మెల్యే మనుషులు అతడిని చితక్కొట్టినట్లు సమాచారం. దాంతో అతడికి రక్తం కూడా కారింది. దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పూర్తి వివరాలు చూస్తే... ప్రయాణికులు చెప్పిన దాన్ని బట్టి ఓ ప్రధాన పార్టీకి చెందిన ఎమ్మెల్యే, ఆయన భార్య, కుమారుడు E-2 కోచ్‌లో ప్రయాణిస్తున్నారు. ఎమ్మెల్యే సీటేమో నెం.8, కానీ ఆయన భార్య, కుమారుడు సీట్లు 50, 51 వచ్చాయి. 49 విండో సీటు.
 
 
అతడిపై అలా దాడి చేసి తక్షణం 49 సీటును వదిలి మరోచోట కూర్చోమని చెప్పి వార్నింగ్ ఇచ్చారు. ఐతే అక్కడే వున్న పోలీసులు ఇంత జరుగుతున్నా పట్టించుకోలేదని తోటి ప్రయాణికులు ఆరోపించారు. మరోవైపు ఎమ్మెల్యే మాట్లాడుతూ... తన మనుషులు వచ్చి ప్రయాణికుడిపై దాడి చేసారనేది అవాస్తవం. మా మనుషులు ఎవరూ లేరు. నేను గొడవ జరుగుతుంటే దగ్గరికి వెళ్లి సర్ది చెప్పానంతే అంటూ వెల్లడించాడు. అతడి స్వభావం కాస్త తేడాగా వుందని ఎమ్మెల్యే సెలవిచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కుబేర కథ నా చుట్టూ తిరుగుతుంది : నాగార్జున, ఎమోషనల్ అయిన శేఖర్ కమ్ముల

లావ‌ణ్య త్రిపాఠి, దేవ్ మోహ‌న్ చిత్రం సతీ లీలావతి ఫస్ట్ లుక్

పవన్ కళ్యాణ్ నుంచి ఏమీ ఆశించలేదు - ది 100 కథ సుకుమార్ కు చెప్పా : ఆర్కే సాగర్

Pawan Kalyan: హరిహరవీరమల్లు కథ రివీల్ చేస్తూ రిలీజ్ డేట్ ప్రకటన

బకాసుర రెస్టారెంట్‌ నుంచి సాంగ్‌ను ఆవిష్కరించిన హరీశ్‌ శంకర్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

తర్వాతి కథనం
Show comments