వందే భారత్ రైలులో నాణ్యత లేని ఆహారానికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. తాజాగా వందేభారత్లో ప్రయాణించిన ఓ ప్రయాణీకుడికి ఇచ్చిన భోజనంలోని సాంబార్లో పురుగులు కనిపించాయి. దీంతో గొడవ చేయడంతో ప్రయాణీకుడికి వెంటనే నూడుల్స్ ఇద్ది సర్ది చెప్పారు.
అయితే తాను ఫుల్ మీల్కు డబ్బులు చెల్లించానని.. తనకు ఇన్స్టెంట్ నూడుల్స్ పెట్టి సరిపెట్టేందుకు ప్రయత్నించారని ప్రయాణీకుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే రైల్వే అధికారులు స్పందించి వందే భారత్ రైలులో అయినా నాణ్యమైన ఆహారాన్ని అందించాలని కోరారు.