Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఎయిర్ ఇండియా విమానంలో తోటి ప్రయాణీకుడిపై మూత్ర విసర్జన

Advertiesment
flight

సెల్వి

, బుధవారం, 9 ఏప్రియల్ 2025 (16:32 IST)
ఢిల్లీ నుండి బ్యాంకాక్ వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం AI2336లో ఒక ప్రయాణికుడు బ్రిడ్జిస్టోన్ మేనేజింగ్ డైరెక్టర్‌పై మూత్ర విసర్జన చేశాడు. తోటి ప్రయాణీకుడిపై మూత్ర విసర్జన చేసిన వ్యక్తి భారతీయ పౌరుడని రిపబ్లిక్ టీవీ నివేదించింది.
 
టైర్ల తయారీ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ ఎయిర్‌లైన్ నుండి క్షమాపణలు కోరింది. ఈ సంఘటన ఎయిర్ ఇండియా బిజినెస్ క్లాస్‌లో జరిగింది. ఈ సంఘటన గురించి ఎయిర్‌లైన్స్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ)కి తెలియజేసింది. మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
 
ఎయిర్ ఇండియాలో ఇలాంటి ఘటనలు కొత్తవేమీ కాదు. విమాన ప్రయాణీకులను నియంత్రించడానికి మరింత సమగ్రమైన మార్గదర్శకాలను రూపొందించాలని సుప్రీంకోర్టు ఇప్పటికే కేంద్రాన్ని- విమానయాన నియంత్రణ సంస్థ డీజీసీఏని ఆదేశాలు జారీ చేసింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పూణేలో భూటాన్ మహిళపై సామూహిక అత్యాచారం.. పార్టీల కంటూ తీసుకెళ్లి?