Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాద్‌లో బాలికకు మత్తిమందిచ్చి అత్యాచారం..

Webdunia
శుక్రవారం, 16 సెప్టెంబరు 2022 (09:15 IST)
హైదరాబాద్ నగరంలో మరో బాలిక అత్యాచారానికి గురైంది. జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్ ఘటనపై మరువక ముందే ఓల్డ్ సిటీలో ఇలాంటి దారుణం ఒకటి జరిగింది. చంచల్‌గూడకు చెందిన ఓ బాలికను ఇద్దరు కామాంధులు కిడ్నాప్ చేసి మత్తుమందిచ్చి అత్యాచారం చేశారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
చంచల్‌గూడకు చెందిన ఓ బాలిక ఈ నెల 12వ తేదీన కిరాణా కొట్టుకు వెళ్లేందుకు ఇంటికి నుంచి బయటకు వచ్చింది. ఆ సమయంలో ఓ కారులో వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఆ బాలికను కారులో ఎక్కించుకుని వెళ్లిపోయారు. బాలిక ఎంత సేపటికీ ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన తల్లింద్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో మిస్సింగ్ కేసుగా నమోదు చేసి విచారణ చేపట్టారు. 
 
ఈ క్రమంలో ఈ నెల 14వ తేదీన బాధిత బాలిక ఎంజీబీఎస్ నాలా వద్ద ఉన్నట్టు పోలీసులకు సమాచారం వచ్చింది. దీంతో ఆమెను అదుపులోకి తీసుకుని విచారించగా అస్సలు విషయం వెల్లడైంది. ఆమె ఇచ్చిన సమాచారం. మేరకు షా కాలనీకి చెందిన సయ్యద్ నేమత్ అహ్మద్ (26), సయ్యద్ రవీష్ అహ్మద్ మెహదీ (20) అనే ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్నారు. 
 
రెండు రోజుల పాటు స్రుజన స్టే ఇన్ హోటల్ (ఓయో), మరో మూడు త్రీ క్యాస్టిల్ డీలక్స్ (ఓయో) లాడ్జీల్లో తీసుకెళ్లి అత్యాచారం చేసినట్టు నిందితులు అంగీకరించారు. ఆమెకు మత్తు మాత్రలు ఇచ్చి ఆమెపై అత్యాచారానికి పాల్పడినట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది. దీంతో వారిని అరెస్టు చేసిన కోర్టులో హాజరుపరిచి జైలుకు తరలించారు. 

సంబంధిత వార్తలు

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం