Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోడలిని గొంతుకోసి హత్య చేసిన మామ.. ఎందుకు.. ఎక్కడ?

Webdunia
మంగళవారం, 4 జనవరి 2022 (08:48 IST)
తన కుమారుడు మృతికి ఇంటి కోడలే కారణమని భావించిన మామ ఆమెపై పగ పెంచుకున్నాడు. ఆ తర్వాత అనుకూలమైన సమయం రాగానే ఆమెను గొంతుకోసి హత్య చేశాడు. ఈ దారుణం తెలంగాణా రాష్ట్రంలోని మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం లింగన్న పేటలో జరిగింది. 
 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, లింగన్నపేటకు చెందిన సౌందర్య  (19) అనే యువతికి అదే గ్రామానికి చెందిన తిరుపతి అనే వ్యక్తి కుమారుడు సాయికృష్ణతో ఐదు నెలల క్రితం ఇచ్చి వివాహం చేశారు. పైగా, వీరిద్దరూ అప్పటికే ప్రేమలో ఉన్నారు. 
 
 
అయితే, భార్యాభర్తల మధ్య ఏర్పడిన మనస్పర్థల కారణంగా సాయికృష్ణ ఆత్మహత్య చేసుకున్నాడు. దీన్ని అతని తల్లిదండ్రులు జీర్ణించుకోలేక పోయారు. మానసికంగా కుంగిపోయారు. అప్పటి నుంచి సౌందర్య పుట్టింటికి వెళ్లి తల్లి వద్దే ఉంటుంది. 
 
 
అయితే, తన కుమారుడు మృతికి కోడలే కారణమని మామ తిరుపతి మనసులో బలంగా నాటుకుని పోయింది. దీంతో ఆమె పగ పెంచుకుని, ఆమెను ఈ భూమిపై లేకుండా చేయాలన్న నిర్ణయానికి వచ్చి, ఇందుకోసం సరైన సమయం కోసం ఎదురుచూడసాగాడు. 
 
 
ఈ క్రమంలో ఇంట్లో సౌందర్య ఒంటరిగా ఉండటాన్ని గమనించిన తిరుపతి... తన వెంట తెచ్చుకున్న కత్తితో ఆమెపై దాడిచేసి. గొంతుకోసి చంపేశాడు. కుమార్తెను రక్షించడం కోసం అడ్డుపడిన ఆమె తండ్రి లక్ష్మయ్యపై కూడా తిరుపతి దాడి చేశాడు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడుని అరెస్టు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Peddi: ఎ.ఆర్.రెహమాన్ మిక్సింగ్ పూర్తి - పెద్ది ఫస్ట్ షాట్‌ సిద్ధం

Trivikram Srinivas: ఆయన నిజంగానే జైంట్ : త్రివిక్రమ్ శ్రీనివాస్

NTR: రావణుడి కంటే రాముడి పాత్ర కష్టం, అందుకే అదుర్స్ 2 చేయలేకపోతున్నా : ఎన్టీఆర్

Sampoornesh: రాజమౌళి గారి పలకరింపే నాకు ధైర్యం : సంపూర్ణేష్ బాబు

Urvashi Rautela : దబిడి దిబిడి తర్వాత ఊర్వశి రౌతేలా సన్నీ డియోల్ జాట్ లో అలరిస్తోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments