Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆంటీ నా బండెక్కండని పొలాల్లోకి తీసుకెళ్లి మహిళపై ఇంజినీరింగ్ విద్యార్థి...

Advertiesment
A 23-year-old engineering student
, శుక్రవారం, 17 డిశెంబరు 2021 (14:46 IST)
సింగరాయకొండ జరుగుమల్లి మండలంలోని చిన్నకుంట శివారులో దారుణం జరిగింది. 52 ఏళ్ల మహిళపై అత్యాచార యత్నం చేయగా ఆమె ప్రతిఘటించడంతో గొంతు నులిమి చంపేశాడు 23 ఏళ్ల ఇంజినీరింగ్ విద్యార్థి.

 
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... జరుగుమల్లి మండలంలోని నందనవనం గ్రామానికి చెందిన వివాహిత కృష్ణవేణి తమ బంధువుల ఇంట్లో శుభకార్యానికి హాజరయ్యేందుకు గురువారం ఉదయం కనమళ్ల గ్రామానికి వచ్చారు. శుభకార్యం అనంతరం ఆమె తిరుగుప్రయాణమయ్యారు.

 
ఇంతలో ఆమె దూరపు బంధువైన 23 ఏళ్ల సూర్యతేజ ఆమెను పలుకరించాడు. ఆంటీ మిమ్మల్ని ఊరిలో నేను దిగబెడతానంటూ తన ద్విచక్రవాహనం ఎక్కించుకున్నాడు. చిన్నకుంట వద్దకు రాగానే పొలాల్లోకి వాహనాన్ని తీసుకెళ్లాడు. అక్కడ పొలాల్లో ఆమెపై లైంగిక దాడికి యత్నించాడు.


ఆమె తీవ్రంగా ప్రతిఘటించడంతో గొంతు నులిమి హత్య చేసాడు. అనంతరం అక్కడ నుంచి పరారయ్యాడు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని పట్టుకునేందుకు గాలిస్తున్నారు.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పెగాసస్‌కు మమతా బెనర్జీకి షాకిచ్చిన సుప్రీంకోర్టు...