Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రేమ పేరుతో వేధింపులు.. యువకుడిని బండరాళ్లతో కొట్టి హతం

Webdunia
మంగళవారం, 25 ఏప్రియల్ 2023 (19:51 IST)
ప్రేమ పేరుతో వేధిస్తున్నాడంటూ ఓ యువకుడిని యువతి కుటుంబసభ్యులు బండరాళ్లతో కొట్టి హతమార్చారు. మంచిర్యాల జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. జైపూర్ మండలం ఇందారంలో అందరూ చూస్తుండగానే చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. 
 
ఇందారం గ్రామానికి చెందిన ఓ యువతితో ఎం. మహేష్ (24) అనే యువకుడు ప్రేమ వ్యవహారం సాగించాడు. గత ఏడాది యువతి తల్లిదండ్రులు సీసీ ప్రాంతానికి చెందిన మరో వ్యక్తితో ఆమెకు వివాహం జరిపించారు.
 
దీంతో యువతిపై క్షక్ష పెంచుకున్న మహేశ్.. ఆమెతో సన్నిహితంగా వున్న వీడియోలను సోషల్ మీడియా పోస్టు చేశాడు. విషయం తెలుసుకున్న యువతి తల్లిదండ్రులు యువకుడిపై జైపూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. 
 
పోలీసులు ఇరు వర్గాలను పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చి కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో ఆరు నెలల క్రితం యువతి భర్త విడాకులు ఇచ్చి ఆత్మహత్య చేసుకున్నాడు. 
 
ఈ క్రమంలో యువతి తన పుట్టింటికి వచ్చింది. అయినా పలుమార్లు యువతిని మహేష్ వేధిస్తూ వచ్చాడు. దీంతో ఆమె కుటుంబ సభ్యులు మళ్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
 
వేధింపులు కొనసాగుతుండటంతో మంగళవారం ఉదయం మహేష్‌పై కత్తి, బండరాళ్లతో యువతి కుటుంబసభ్యులు దాడి చేసి హతమార్చారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆ హీరో కళ్లలో గమ్మత్తైన ఆకర్షణ ఉంది : షాలిని పాండే

సిలికాన్‌లో ఏఐ రీసెర్చ్ సెంటర్‌ లో సీఈఓ అరవింద్ శ్రీనివాస్‌ను కలిసిన కమల్ హాసన్

జై శ్రీరామ్ అంటూ తన్మయంతో డాన్స్ చేసిన మెగాస్టార్ చిరంజీవి

Indraganti: సారంగపాణి జాతకం చూసేందుకు డేట్ ఫిక్స్ చేసిన నిర్మాత

వేర్వేరు లక్ష్యాలతో ఉన్నఇద్దరి ప్రేమ కథతో డియర్ ఉమ విడుదలకు సిద్ధమైంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments