Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్థల వివాదం : పోలీస్ స్టేషన్‌ బయట తల్లిపై పెట్రోల్ పోసి నిప్పంటించి కుమారుడు.. ఎక్కడ?

వరుణ్
బుధవారం, 17 జులై 2024 (11:41 IST)
ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలో ఘోరం జరిగింది. ఓ స్థల వివాదం కారణంగా కన్నబిడ్డ కిరాతక చర్యకు పాల్పడ్డాడు. పోలీసు స్టేషన్‌ బయట కన్నతల్లిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. దీన్ని గమనించిన పోలీసులు ఆ మహిళ ప్రాణాలు కాపాడేందుకు ప్రయత్నించారు. అయితే, తీవ్రంగా గాయపడిన ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. సీసీటీవీలో రికార్డైన ఈ ఘటన అలీఘర్‌లోని ఖైర్ పోలీస్ స్టేషన్‌లో మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో జరిగింది.
 
పోలీసులు వెల్లడించిన కథనం మేరకు.. ఓ స్థలం విషయంపై తల్లి హేమలత, కొడుకు గౌరవ్‌ల మధ్య గత కొంతకాలంగా వివాదం నడుస్తుంది. తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు గౌరవ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ విషయాన్ని పరిష్కరించుకునేందుకు వారిద్దరూ పోలీస్ స్టేషన్‌కు వచ్చారు. ఈ క్రమంలో బయటకు వెళ్లిన మహిళ తిరిగి వస్తుండగా బయటే నిలబడివున్న కుమారుడు ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. 
 
ఆమెకు ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఆ మహిళ తాళలేక గిలగిలా కొట్టుకుంది. మరోవైపు, కుమారుడు అత్యంత క్రూరంగా ప్రవర్తించాడు. ఒకవైపు కన్నతల్లి మంటల్లో కాలిపోతుంటే తన మొబైల్‌లో వీడియోను రికార్డు చేశాడు. మంటలు ఒక్కసారిగా ఎగిసిపడటంతో క్షణకాలం వెనకడుగు వేసిన పోలీసులు.. ఆ తర్వాత ఆమెను రక్షించి సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.
 
అయితే, అప్పటికే ఆమెకు 40 శాతం కాలిన గాయాలు కావడంతో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచింది. ఆమెను కాపాడే ప్రయత్నంలో ఒకరిద్దరూ పోలీసులు కూడా గాయాలపాలయ్యారు. ఈ కిరాతక చర్యకు పాల్పడిన గౌరవ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మా నాన్న సూపర్ హీరో' నుంచి నాన్న సాంగ్ రిలీజ్

తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులో 1960లో జరిగిన కథతో శర్వానంద్, సంపత్ నంది చిత్రం

జానీ మాస్టర్ ఇష్యూలో రాజకీయరంగు - మీడియాపై కేసుపెడతానన్న జానీమాస్టర్ భార్య అయేషా

జానీ మాస్టర్... మీరు దోషి అయితే... దానిని అంగీకరించండి : మంచు మనోజ్ ట్వసీట్

కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అరెస్టు.. స్పందించేందుకు నిరాకరించిన భార్య!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లో బెస్పోక్ టైలరింగ్, ఫైన్ క్లాతింగ్‌లో 100 ఏళ్ల వారసత్వం కలిగిన పిఎన్ రావు కార్యక్రమాలు

డిజైన్ డెమోక్రసీ 2024-డిజైన్, ఆర్ట్- ఇన్నోవేషన్ యొక్క భవిష్యత్తు

మెక్‌డొనాల్డ్స్ ఇండియా నుంచి మెక్‌క్రిస్పీ చికెన్ బర్గర్, క్రిస్పీ వెజ్జీ బర్గర్‌

మునగాకును ఉడకబెట్టిన నీటిని ప్రతిరోజూ ఉదయం తాగితే..

ఖాళీ కడుపుతో వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే?

తర్వాతి కథనం
Show comments