Webdunia - Bharat's app for daily news and videos

Install App

అత్తతో అక్రమ సంబంధం.. చివరకు శవమై తేలాడు.. ఎలా?

Webdunia
బుధవారం, 14 డిశెంబరు 2022 (08:57 IST)
వరుసకు అత్త అయిన మహిళతో ఓ యువకుడు పెట్టుకున్న వివాహేతర సంబంధం చివరకు అతని ప్రాణాలు తీసింది. ఈ దారుణం ఏపీలోని కడప జిల్లా రాజుపాళెం గ్రామంలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే.. 
 
మండల కేంద్రమైన రాజుపాళెంకు చెందిన నరసమ్మ అనే మహిళకు కొన్నేళ్ళ క్రితమే భర్త చనిపోయాడు. ఈమెకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇద్దరు పిల్లలను పోషించుకుంటు ఉంటుంది. ఈ క్రమంలో తన కుమార్తెను అదే ఊరిలో ఓ పెద్ద దస్తగిరి అనే యువకుడికి ఇచ్చి పెళ్లి చేసింది. ఈయనకు తల్లి, తమ్ముడు చిన్న దస్తగిరి (28) ఉన్నాడు. వీరి తండ్రి కూడా కొన్నేళ్ల క్రితం చనిపోయాడు. 
 
ఈ క్రమంలో నరసమ్మకు చిన్నదస్తగిరికి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. గత కొంతకాలంగా సాగుతూ వచ్చింది. ఈ నేపథ్యంలో కుట్టుమిషన్లు రిపేరు చేసే దస్తగిరికి ఇటీవల పెళ్లి సంబంధాలు చూడసాగారు. ఈ విషయం నరసమ్మకు తెలిసింది. నేను ఉండగా మరో పెళ్లి ఎలా చేసుకుంటావో చూస్తానంటూ బెదిరించసాగింది. 
 
శుక్రవారం సాయంత్రం ఇదే విషయంపై అతడితో గొడవకు దిగింది. పైగా, చిన్నదస్తగిరి తనను వదిలి మరో పెళ్లికి సిద్ధమవడాన్ని జీర్ణించుకోలేక పోయింది. దీంతో ఆవేశంతో అతన్ని కత్తితో పొడవడంతో అతను అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. సమాచారం అందుకున్న పోలీసులు హత్యాస్థలికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి నరసమ్మను అరెస్టు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments