Webdunia - Bharat's app for daily news and videos

Install App

అత్తతో అక్రమ సంబంధం.. చివరకు శవమై తేలాడు.. ఎలా?

Webdunia
బుధవారం, 14 డిశెంబరు 2022 (08:57 IST)
వరుసకు అత్త అయిన మహిళతో ఓ యువకుడు పెట్టుకున్న వివాహేతర సంబంధం చివరకు అతని ప్రాణాలు తీసింది. ఈ దారుణం ఏపీలోని కడప జిల్లా రాజుపాళెం గ్రామంలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే.. 
 
మండల కేంద్రమైన రాజుపాళెంకు చెందిన నరసమ్మ అనే మహిళకు కొన్నేళ్ళ క్రితమే భర్త చనిపోయాడు. ఈమెకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇద్దరు పిల్లలను పోషించుకుంటు ఉంటుంది. ఈ క్రమంలో తన కుమార్తెను అదే ఊరిలో ఓ పెద్ద దస్తగిరి అనే యువకుడికి ఇచ్చి పెళ్లి చేసింది. ఈయనకు తల్లి, తమ్ముడు చిన్న దస్తగిరి (28) ఉన్నాడు. వీరి తండ్రి కూడా కొన్నేళ్ల క్రితం చనిపోయాడు. 
 
ఈ క్రమంలో నరసమ్మకు చిన్నదస్తగిరికి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. గత కొంతకాలంగా సాగుతూ వచ్చింది. ఈ నేపథ్యంలో కుట్టుమిషన్లు రిపేరు చేసే దస్తగిరికి ఇటీవల పెళ్లి సంబంధాలు చూడసాగారు. ఈ విషయం నరసమ్మకు తెలిసింది. నేను ఉండగా మరో పెళ్లి ఎలా చేసుకుంటావో చూస్తానంటూ బెదిరించసాగింది. 
 
శుక్రవారం సాయంత్రం ఇదే విషయంపై అతడితో గొడవకు దిగింది. పైగా, చిన్నదస్తగిరి తనను వదిలి మరో పెళ్లికి సిద్ధమవడాన్ని జీర్ణించుకోలేక పోయింది. దీంతో ఆవేశంతో అతన్ని కత్తితో పొడవడంతో అతను అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. సమాచారం అందుకున్న పోలీసులు హత్యాస్థలికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి నరసమ్మను అరెస్టు చేశారు. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments