Webdunia - Bharat's app for daily news and videos

Install App

వివాహితను హత్య చేసి ఫేస్‌బుక్‌ లైవ్‌‌లో నిజం చెప్పి ఆత్మహత్య చేసుకున్న ప్రియుడు

Webdunia
బుధవారం, 16 నవంబరు 2022 (13:28 IST)
తనతో అక్రమ సంబంధం కొనసాగించిన వివాహితను ముందుగా హత్య చేసిన ప్రియుడు.. హత్య చేసినట్టు ఫేస్‌బుక్ లైవ్‌లో వెల్లడించి ఆ తర్వాత తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ దారుణం వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో జరిగింది. తనతో అక్రమ సంబంధం పెట్టుకున్న వివాహిత.. కట్టుకున్న భర్తను వదిలి తన వద్దకు రాకపోవడంతో ఆ కిరాతక ప్రియుడు ఈ దారుణానికి పాల్పడ్డాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
బెంగాల్ రాష్ట్రంలోని సిలిగిరి ప్రాంతానికి చెందిన రియా బిస్వాస్ అనే మహిళకు ఇది వరకే వివాహమై భర్త, ఐదేళ్ల కుమారుడు ఉన్నాడు. ఈమెకు అదే ప్రాంతానికి చెందిన కిరణ్ దేబ్‌నాథ్ అనే యువకుడితో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఇది గత రెండేళ్లుగా కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో కట్టుకున్న భర్తను వదిలేసి తనతో రావాలంటూ రియాపై కిరణ్ ఒత్తిడి చేయసాగాడు. 
 
ఈ క్రమంలో ఆదివారం రాత్రి రియా ఇంటికి కిరణ్ వెళ్లాడు. ఇదే విషయంపై వారిద్దరి మధ్య గొడవ జరిగింది. భర్తను వదిలి కిరణ్‌తో వెళ్లేందుకు రియా అంగీకరించలేదు. దీంతో ఆగ్రహించిన కిరణ్ తన వెంట తెచ్చుకున్న కత్తితో రియా గొంతు కోసి హత్య చేశాడు. మృతదేహాన్ని బాత్రూంలో పడిసే ఏమీ ఏరుగనట్టుగా ఇంటికి వెళుతూ రైల్వే స్టేషన్ సమీపంలో ఆత్మహత్య చేసుకున్నాడు. 
 
ఈ ఆత్మహత్యకు ముందు కిరణ్ ఫేస్‌బుక్‌ లైవ్‌లోకి వచ్చి తాను రియను చంపేశానని, భర్తను వదిలి తనతో వచ్చేందుకు నిరాకరించడం వల్లే ఈ పని చేసి, తాను కూడా ఆత్మహత్య చేసుకుంటున్నట్టు చెప్పాడు. ఆ తర్వాత సూసైడ్ చేసుకున్నాడు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న స్కై మూవీ

గడపగడపకు ఆర్కే నాయుడు నుంచి విక్రాంత్ ఐపీఎస్ గా మారా : ఆర్‌కె సాగర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments