Webdunia - Bharat's app for daily news and videos

Install App

హీరో కృష్ణ పార్థివదేహానికి సీఎం జగన్ నివాళులు

Webdunia
బుధవారం, 16 నవంబరు 2022 (12:45 IST)
వృద్దాప్యంతో పాటు అనారోగ్యం కారణంగా మంగళవారం వేకువజామున తుదిశ్వాస విడిచిన హీరో కృష్ణ పార్థివదేహానికి ఏపీ ముఖ్యమంత్రి, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి బుధవారం నివాళులు అర్పించారు. ఇందుకోసం ఆయన విజయవాడ నుంచి హైదరాబాద్‌కు ప్రత్యేక హెలికాఫ్టరులో వెళ్లారు. 
 
అక్కడ పద్మాలయ స్టూడియోస్‌లో అభిమానుల సందర్శనార్థం ఉంచిన పార్థివదేహానికి పుష్పగుచ్ఛం ఉంచిన సీఎం జగన్ నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా తండ్రిని కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న హీరో మహేష్ బాబును సీఎం జగన్ ఆలింగనం చేసుకుని ఓదార్చారు. ఆ తర్వాత కృష్ణ కుటుంబ సభ్యులకు ఆయన ధైర్యం చెప్పారు. 
 
కాగా, కృష్ణ పార్థివదేహానికి అంతిమ సంస్కారాలు బుధవారం మధ్యాహ్నం నిర్వహిస్తారు. జుబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో ఆయన అంత్యక్రియలు తెలంగాణ ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో పూర్తి చేస్తారు. ఈ సందర్భంగా మహాప్రస్థానంలో ఏర్పాట్లు చేసి భారీ భద్రతను కల్పించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఈడీ విచారణకు హాజరైన ఏస్ ప్రొడ్యూసర్.. వివరణ ఇచ్చిన అల్లు అరవింద్

Prabhas: ఆదిపురుష్ తో ప్రభాస్ రాంగ్ స్టెప్ వేశాడా? ఎవరైనా వేయించారా?

666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్ చిత్రం నుండి డాలీ ధనుంజయ్ లుక్

కిరీటి రెడ్డి, శ్రీలీల పై జూనియర్ చిత్రంలో వయ్యారి సాంగ్ చిత్రీకరణ

Rana: రానా దగ్గుబాటి సమర్పణలో కొత్తపల్లిలో ఒకప్పుడు టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments