Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్యపై అనుమానం.. కత్తెరతో పొడిచి చంపేసిన భర్త! (Video)

వరుణ్
ఆదివారం, 21 జులై 2024 (13:06 IST)
ఈస్ట్ గోదావరి జిల్లాలోని నిడదవోలులో దారుణం జరిగింది. కట్టుకున్న భార్యపై అనుమానం పెంచుకున్న భర్త.. ఆమెను అత్యంత కిరాతకంగా చంపేశాడు. కత్తెరతో పొడిచి హత్య చేశాడు. ఈ ఘటన జిల్లాలోని నిడదవోలు మండలం శెట్టిపేట గ్రామంలో జరిగింది. మృతురాలిని నవ్యగా గుర్తించారు. 
 
నిడదవోలు మండలం శెట్టిపేట గ్రామానికి చెందిన కురసాల చిరంజీవి తాపీ పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈయనకు పదకొండేళ్ల క్రితం పెరవలి మండలం అన్నవరపాడు గ్రామానికి చెందిన నవ్యతో వివాహమైంది. వీరికి ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. అయితే, గత కొన్ని రోజులుగా చిరంజీవి భార్య వేరే వ్యక్తితో సన్నిహితంగా ఉంటుంది అన్న అనుమానం పెంచుకున్నాడు. 
 
ఇదే విషయంపై గత రాత్రి భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. దీంతో ఆగ్రహానికి గురైన చిరంజీవి... భార్య నవ్యను కత్తెరతతో పొడిచాడు. దీంతో తీవ్రంగా గాయపడటంతో ఆమె అక్కడే ప్రాణాలు కోల్పోయింది. దీనిపై మృతురాలి తండ్రి తండ్రి వెలగం శ్రీను నిడదవోలు పోలీసు స్టేషనులో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: రాజాసాబ్ రిలీజ్ కోసం తిరుపతి, శ్రీకాళహస్తి ఆలయాలను దర్శించిన మారుతి

Vijayashanti : కళ్యాణ్ రామ్, విజయశాంతి పై ముచ్చటగా బంధాలే.. పాట చిత్రీకరణ

హీరోయిన్ శ్రీలీలతో డేటింగా? బాలీవుడ్ హీరో ఏమంటున్నారు!!

Ram Prakash : రిలేషన్, ఎమోషన్స్‌, వినోదం కలయికలో చెరసాల సిద్ధం

Sumaya Reddy: గుడిలో కన్నా హాస్పిటల్‌లో ప్రార్థనలే ఎక్కువ.. అంటూ ఆసక్తిగా డియర్ ఉమ టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ది బేర్ హౌస్ స్టోర్ ప్రారంభం

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

తర్వాతి కథనం
Show comments