Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్యపై అనుమానం.. కత్తెరతో పొడిచి చంపేసిన భర్త! (Video)

వరుణ్
ఆదివారం, 21 జులై 2024 (13:06 IST)
ఈస్ట్ గోదావరి జిల్లాలోని నిడదవోలులో దారుణం జరిగింది. కట్టుకున్న భార్యపై అనుమానం పెంచుకున్న భర్త.. ఆమెను అత్యంత కిరాతకంగా చంపేశాడు. కత్తెరతో పొడిచి హత్య చేశాడు. ఈ ఘటన జిల్లాలోని నిడదవోలు మండలం శెట్టిపేట గ్రామంలో జరిగింది. మృతురాలిని నవ్యగా గుర్తించారు. 
 
నిడదవోలు మండలం శెట్టిపేట గ్రామానికి చెందిన కురసాల చిరంజీవి తాపీ పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈయనకు పదకొండేళ్ల క్రితం పెరవలి మండలం అన్నవరపాడు గ్రామానికి చెందిన నవ్యతో వివాహమైంది. వీరికి ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. అయితే, గత కొన్ని రోజులుగా చిరంజీవి భార్య వేరే వ్యక్తితో సన్నిహితంగా ఉంటుంది అన్న అనుమానం పెంచుకున్నాడు. 
 
ఇదే విషయంపై గత రాత్రి భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. దీంతో ఆగ్రహానికి గురైన చిరంజీవి... భార్య నవ్యను కత్తెరతతో పొడిచాడు. దీంతో తీవ్రంగా గాయపడటంతో ఆమె అక్కడే ప్రాణాలు కోల్పోయింది. దీనిపై మృతురాలి తండ్రి తండ్రి వెలగం శ్రీను నిడదవోలు పోలీసు స్టేషనులో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

Dhanush: పవన్ కళ్యాణ్ సినిమానే ధనుష్ ఎందుకు డైరెక్ట్ చేస్తానన్నాడు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

తర్వాతి కథనం
Show comments