Webdunia - Bharat's app for daily news and videos

Install App

మూడు ముళ్ళు వేసిన వరుడిని పెళ్ళిపీటలపై అరెస్టు చేసిన పోలీసులు!!

ఠాగూర్
ఆదివారం, 25 ఆగస్టు 2024 (17:20 IST)
వధువు మెడలో మూడు ముళ్లు వేసిన కొన్ని ఘడియలు కూడా ముగియకముందే వరుడుని పెళ్లిపీటలపైనే పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన కర్నాటక రాష్ట్రంలోని చిత్రదుర్గం జిల్లా హొళల్కెరె తాలూకా టి ఎమ్మిగనూరులో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
టి.ఎమ్మిగనూరు గ్రామానికి చెందిన రంగస్వామి అనే యువకుడికి చెళ్లకెర తాలూకాలోని ఓ గ్రామానికి చెందిన 17 ఏళ్ల బాలికతో వివాహం నిశ్చయమైంది. ఈ విషయం స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారి మల్లేశ్‌కు తెలిసింది. ఆయన పోలీసులను వెంటబెట్టుకొని ఆ గ్రామం చేరుకున్నారు. వివాహం వరుడి గ్రామం టి. ఎమ్మిగనూరులో జరుగుతోందని తెలుసుకొని ఆక్కడికి వెళ్లారు. 
 
ఆ పాటికే వరుడు వధువు మెడలో మూడుముళ్లు వేశారు. అధికారులు, పోలీసులు బాలిక చదివే పాఠశాలకు వెళ్లి ఆమె జన్మదిన వివరాలు సేకరించారు. బాలికకు 17 సంవత్సరాలు 2 రోజుల వయసున్నట్లు నిర్ధారించారు. చట్టం ప్రకారం పోలీసులు వరుడు రంగస్వామిని అదుపులోనికి తీసుకొని, కేసు నమోదు చేసి కోర్టుకు హాజరుపరిచారు. హొళల్కెరె పోలీసు ఠాణాలో కేసు నమోదైంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆంజనేయ స్వామి దయతో మార్క్ శంకర్ ఇంటికొచ్చేసాడు : చిరంజీవి

అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో వచ్చేస్తున్న తల్లి మనసు

Nikhil: దేవుడి దయవల్ల తొలి సినిమా హ్యాపీ డేస్ అయింది : హీరో నిఖిల్

NTR; అర్జున్ S/O వైజయంతి సినిమా ప్రీ రిలీజ్ కి తమ్ముడు వస్తాడు : కళ్యాణ్ రామ్

Raviteja: తు మేరా లవర్ అంటూ రవితేజ మాస్ జాతర సాంగ్ రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments