Webdunia - Bharat's app for daily news and videos

Install App

మూడు ముళ్ళు వేసిన వరుడిని పెళ్ళిపీటలపై అరెస్టు చేసిన పోలీసులు!!

ఠాగూర్
ఆదివారం, 25 ఆగస్టు 2024 (17:20 IST)
వధువు మెడలో మూడు ముళ్లు వేసిన కొన్ని ఘడియలు కూడా ముగియకముందే వరుడుని పెళ్లిపీటలపైనే పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన కర్నాటక రాష్ట్రంలోని చిత్రదుర్గం జిల్లా హొళల్కెరె తాలూకా టి ఎమ్మిగనూరులో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
టి.ఎమ్మిగనూరు గ్రామానికి చెందిన రంగస్వామి అనే యువకుడికి చెళ్లకెర తాలూకాలోని ఓ గ్రామానికి చెందిన 17 ఏళ్ల బాలికతో వివాహం నిశ్చయమైంది. ఈ విషయం స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారి మల్లేశ్‌కు తెలిసింది. ఆయన పోలీసులను వెంటబెట్టుకొని ఆ గ్రామం చేరుకున్నారు. వివాహం వరుడి గ్రామం టి. ఎమ్మిగనూరులో జరుగుతోందని తెలుసుకొని ఆక్కడికి వెళ్లారు. 
 
ఆ పాటికే వరుడు వధువు మెడలో మూడుముళ్లు వేశారు. అధికారులు, పోలీసులు బాలిక చదివే పాఠశాలకు వెళ్లి ఆమె జన్మదిన వివరాలు సేకరించారు. బాలికకు 17 సంవత్సరాలు 2 రోజుల వయసున్నట్లు నిర్ధారించారు. చట్టం ప్రకారం పోలీసులు వరుడు రంగస్వామిని అదుపులోనికి తీసుకొని, కేసు నమోదు చేసి కోర్టుకు హాజరుపరిచారు. హొళల్కెరె పోలీసు ఠాణాలో కేసు నమోదైంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రూ.100 కోట్ల క్లబ్ దిశగా కళ్యాణి ప్రియదర్శన్ 'లోకా' పరుగులు

సోనీ పిక్చర్స్ సిసు: రోడ్ టు రివెంజ్ నాలుగు భాషల్లో గ్రాండ్ రిలీజ్ కాబోతోంది

అనారోగ్యంతో వున్న నటుడు రామచంద్రను పరామర్శించిన మనోజ్

స్టూడెంట్ లైఫ్ లో చేసిన పనులన్నీ లిటిల్ హార్ట్స్ లో గుర్తుకువస్తాయి : శివానీ నాగరం

Pawan : డియర్ ఓజీ నిన్ను కలవాలనీ, చంపాలని ఎదురుచూస్తున్నానంటూ గ్లింప్స్ విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments