Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్నానం చేస్తుండగా న్యూడ్ ఫోటోలు.. వాటిని చూపిస్తూ యేడాదిగా అత్యాచారం

Webdunia
శుక్రవారం, 3 మార్చి 2023 (10:54 IST)
పొరుగింటి మహిళ స్నానం చేస్తుండగా ఓ కామాంధుడు ఆమెను నగ్నంగా ఫోటోలు తీశాడు. వాటిని చూపి బెదిరిస్తూ ఒక యేడాది కాలంగా ఆమెపై లైంగికదాడికి పాల్పడుతూ వచ్చాడు. విజయవాడ నగరంలో ఈ దారుణం తాజాగా వెలుగులోకి వచ్చింది. నగరంలోని విశాలాంధ్ర కాలనీకి చెందిన పుట్టా సుభాష్ (45) అనే వ్యక్తి బీపీసీఎల్ కంపెనీలో పైపులైన్ సెట్టింగ్ చేసే కార్మికుడు. రాజీవ్ నగర్‌కు చెందిన ఓ మహి (35) శాంతి నగర్‌లో భర్తతో కలిసి చిన్న కిరాణా దుకాణం నిర్వహిస్తుంది. పలుమార్లు ఆ దుకాణంలో సరకులు కొనుగోలు చేసిన సుభాష్... పేటీఎం ద్వారా డబ్బులు చెల్లించేవాడు. 
 
ఈ క్రమంలో ఆమె నంబరు తీసుకున్నాడు. ఇదిలావుంటే ఓ రోజున ఆమె స్నానం చేస్తుండగా, ఫోటోలు తీశాడు. వీటిని ఆమె ఫోనుకు పంపుతూ వేధించసాగాడు. పైగా వాటిని చూపి బెదిరించి అత్యాచారానికి తెగబడ్డాడు. అలా గత యేడాది కాలంగా బెదిరిస్తూనే అత్యాచారం చేస్తున్నాడు. 
 
అక్కడితో ఆగకుండా తనకు రూ.16 లక్షల డబ్బులు కావాలంటూ డిమాండ్ చేసి తీసుకున్నాడు. ఆ డబ్బును చెల్లించమని అడిగినందుకు ఆమెపై దాడి చేశాడు. అతని ఆగడాలు శృతిమించి పోవడంతో కుటుంబ సభ్యులతో కలిసి ఆమె సుభాష్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు.. కామాంధుడిని అరెస్టు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments