Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్యాభర్తల మధ్య గొడవ - ట్రిపుల్ మర్డర్ - ఆత్మహత్య

Webdunia
మంగళవారం, 12 డిశెంబరు 2023 (11:42 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. భార్యాభర్తల మధ్య ఏర్పడిన గొడవ చివరకు ముగ్గురి హత్యకు.. ఓ ఆత్మహత్యకు దారితీసింది. భార్య, ఇద్దరు పిల్లలను హత్య చేసిన భర్త.. ఆపై తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ దారుణం యూపీలోని బల్లియా జిల్లాలో జరిగింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, బల్లియా జిల్లా బన్స్‌‍దిహ్ కొత్వాలి పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామ సభ దేవ్‌డిహ్‌లో తోటలో ఆదివారం రాత్రి 11 గంటల సమయంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతదేహాలు కనిపించాయి. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు... ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. ఒక మహిళ, ఇద్దరు చిన్నారులు హత్యకు గురైనట్టు గుర్తించారు. వీరి గొంతులను పదునైన ఆయుధంతో కోసి చంపేసినట్టు పోలీసులు తెలిపారు. 
 
మృతదేహాలకు సమీపంలో ఉన్న ఓ చెట్టుకు వేలాడుతూ ఓ వ్యక్తి మృతదేహం కనిపించింది. మృతుడు దేవ్‌డిహ్‌కు చెందిన మోహన్‌ రాయ్ కుమారుడు శ్రవణ్ రామ్‌గా గుర్తించారు. అతని భార్య శశికళా దేవి (35), వారి ఇద్దరు పిల్లలను శ్రవణ్ పదునైన ఆయుధంతో హత్య చేసి, ఆపై శ్రవణ్ రామ్ బలవన్మరణానికి పాల్పడినట్టు గుర్తించారు. ఆదివారం భార్యాభర్తల మధ్య గొడవ జరిగినట్టు తెలుస్తుందని, దీంతో ఆవేశానికి లోనైన శ్రవణ్ రామ్... ఆత్మహత్యకు పాల్పడినట్టు పోలీసులు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments