Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహిళపై యువకుడు అత్యాచారం.. ఆపై ప్రైవేటు భాగాల్లోకి కర్ర చొప్పించిన వైనం

Webdunia
మంగళవారం, 16 ఆగస్టు 2022 (10:24 IST)
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఓ మహిళపై క్రూర అత్యాచారం జరిగింది. రాష్ట్రంలోని సింగ్రౌలీ జిల్లాలో ఈ దారుణం జరిగింది. 30 యేళ్ల మహిళపై ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత బాధితురాలి ప్రైవేట్ భాగాల్లోకి కర్రను చొప్పించాడు. రాష్ట్రంలోని ఝుమరియా టోలా గ్రామంలో ఈ దారుణం జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఈ గ్రామానికి చెందిన ఓ మహిళ ఇంట్లో ఒంటరిగా ఉండగా, దీన్ని గమనించిన ఓ యువకుడు ఆమె ఇంటిలోకి అర్థరాత్రి ప్రవేశించి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వా ఆమె పట్ల పాశవికంగా ప్రవర్తించాడు. మహిళ జననాంగాల్లోకి కర్రను చొప్పించాడు. దీంతో నొప్పి భరించలేక ఆ మహిళ బిగ్గరగా కేకలు వేయడంతో అక్కడ నుంచి పారిపోయాడు. ఈ క్రమంలో తన మొబైల్ ఫోన్‌ను బాధితురాలి ఇంట్లోనే వదిలివేసి వెళ్లాడు. 
 
బాధితురాలి అరుపులు విన్న ఇరుగుపొరుగువారు అక్కడకు చేరుకుని ఆమెను ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై మోర్వా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి నిందితుడిన అరెస్టు చేశారు. అత్యాచార బాధితురాలి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments