Webdunia - Bharat's app for daily news and videos

Install App

అవసరానికి డబ్బిచ్చిన మేనమామను చంపి ముక్కలు చేసిన కిరాతకుడు..

Webdunia
మంగళవారం, 18 జులై 2023 (09:07 IST)
తనకు అవసరానికి అడిగినపుడల్లా డబ్బు ఇచ్చిన మేనమామను ఓ కిరాతకుడు దారుణంగా హత్య చేశాడు. ఆ తర్వాత శరీరాన్ని ముక్కలు చేసి సంచుల్లో పాతిపెట్టాడు. ఈ దారుణ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, రాష్ట్రంలోని గుణ జిల్లాకు చెందిన వివేక్ శర్మ (45) అనే వ్యాపారి తన మేనల్లుడు మోహిత్‌కు రూ.90 వేలు అప్పుగా ఇచ్చాడు. వాటిని తిరిగి ఇవ్వాలని కోరినా మోహిత్ పట్టించుకోలేదు. 
 
ఈ క్రమంలో డబ్బులు వసూలు చేసేందుకు ఈ నెల 12వ తేదీన వివేక్.. మేనల్లుడు మోహిత్ ఇంటికి వెళ్లాడు. డబ్బులు ఇవ్వడం లేదని మోహిత్ తన మేనమామను మట్టుబెట్టాలన్న నిర్ణయానికి వచ్చాడు. దీంతో మామకు మత్తు కలిపిన టీని మోహిత్ ఇచ్చాడు. దీన్ని సేవించగానే అతను అపస్మారకస్థితిలోకి జారుకున్నాడు. ఆ తర్వాత ఆయన్ను హత్య చేసి మృతదేహాన్ని ముక్కలు చేసి శరీర భాగాలను గోనె సంచుల్లో వేసి పాతిపెట్టేశాడు. 
 
అయితే, వివేక్ శర్మ ఎంతకీ ఇంటికి తిరిగి రాకపోవడంతో ఆయన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో మిస్సింగ్ కేసును నమోదు చేసిన పోలీసులు... మోహిత్‌‍ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. పాతిపెట్టిన వివేక్ శరీర భాగాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

భార్య విడాకులు.. సౌదీ యూట్యూబర్‌తో నటి సునైనా నిశ్చితార్థం..

సరిగ్గా 10 యేళ్ల క్రితం మేం ముగ్గురం... 'కల్కి' దర్శకుడు నాగ్ అశ్విన్ ట్వీట్ వైరల్..

భయపెట్టబోతున్న అప్సరా రాణి.. రాచరికం - పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో షురూ

సూప‌ర్ నేచుర‌ల్ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్‌ కథతో సుధీర్ బాబు నూతన చిత్రం

నటి గా అవకాశాలు కోసం ఆచితూచి అడుగులేస్తున్న శివానీ రాజశేఖర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రై ఫ్రూట్ హల్వా ఆరోగ్యకరమైనదా?

పిల్లలకు నచ్చే మలాయ్ చికెన్ ఇంట్లోనే చేసేయవచ్చు.. ఇలా..?

రక్తదానం చేస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

గుమ్మడి విత్తనాలు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

ట్రిపుల్ నెగిటివ్ రొమ్ము క్యాన్సర్‌కు విజయవాడలోని అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతంగా చికిత్స

తర్వాతి కథనం
Show comments