బెంగుళూరులో దారుణం - ఐఫోన్ కొనేందుకు డబ్బులు లేక డెలివరీ బాయ్‌ హత్య

Webdunia
సోమవారం, 20 ఫిబ్రవరి 2023 (12:46 IST)
కర్నాటక రాష్ట్రంలో దారుణం జరిగింది. ఈ-మార్కెటింగ్ వెబ్‌సైట్‌లో ఐఫోన్ బుక్ చేసిన ఓ వ్యక్తి.. దానికి డబ్బులు చెల్లించలేక డెలివరీ బాయ్‌ను హత్య చేసిన ఘటన ఒకటి వెలుగు చూసింది. ఈ వివరాలను పరిశీలిస్తే, రాష్ట్రంలోని హాసన్ జిల్లాలోని అంచ్ కొప్పల్ రైల్వే స్టేషన్ సమీపంలో ఈ నెల 11వ తేదీన కాలిన శరీరాన్ని ఒకటి వెలుగు చూసింది. దీనిపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతుడిని హేమంత్ నాయక్ (20)గా గుర్తించారు. ఫ్లిప్‌కార్ట్ ఉద్యోగిగా పని చేస్తున్నట్టు దర్యాప్తులో వెల్లడైంది. 
 
లక్ష్మీపుర లే ఔట్ సమీపంలో నివాసం ఉండే హేమంత్ దత్తా అనే వ్యక్తి సెకండ్ హ్యాండ్ ఐఫోన్‌ను బుక్ చేసుకున్నాడు. దాన్ని డెలివరీ చేసేందుకు హేమంత్ నాయక్ ఈ నెల 7వ తేదీన హేమంత్ దత్తా ఇంటికి వచ్చాడు. ఫోన్ డెలివరీ చేసేందుకు రూ.46 వేలు చెల్లించాలని కోరాడు. అంత డబ్బు తన వద్ద లేకపోవడంతో డెలీవరీ బాయ్‌ను హేమంత్ దత్తా కత్తితో పొడిచాడు. 
 
ఆ తర్వాత మృతదేహాన్ని ప్యాక్ చేసి ద్విచక్రవాహనంపై పెట్టుకుని రైల్వే స్టేషన్ సమీపంలో పెట్రోల్ పోసి దహనం చేసినట్టు పోలీసులు జరిపిన విచారణలో వెల్లడైంది. సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా పోలీసులు ఈ కేసులోని మిస్టరీని ఛేదించారు. దీంతో హేమంత్ దత్తాను పోలీసులు అరెస్టు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'దండోరా'లో వేశ్య పాత్ర చేయడానికి కారణం ఇదే : నటి బిందు మాధవి

Zee 5: ది గ్రేట్‌ ప్రీ వెడ్డింగ్ షో స్ట్రీమింగ్‌ జీ 5 లో రాబోతోంది

Raju Weds Rambai Review: నిఖార్సయిన ప్రేమకథగా రాజు వెడ్స్ రాంబాయి రివ్యూ

12A Railway Colony Review,: అల్లరి నరేష్ కు 12ఏ రైల్వే కాలనీ గట్టెక్కించేలా? 12ఏ రైల్వే కాలనీ రివ్యూ

Premante Review: గాడి తప్పిన ప్రియదర్శి, ఆనంది ల ప్రేమ.. ప్రేమంటే రివ్యూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments