Webdunia - Bharat's app for daily news and videos

Install App

రెండో భార్యతో గొడవ - కన్న కొడుకుని చంపేసిన తండ్రి

Webdunia
మంగళవారం, 16 మే 2023 (10:51 IST)
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్‌‍లో దారుణం జరిగింది. రెండో భార్యతో గొడవపడిన తండ్రి.. కన్నబిడ్డను చంపేశాడు. మొదటి భార్య చనిపోవడంతో రెండో పెళ్లి చేసుకున్నాడు. కానీ, కొడుకు విషయంలో రెండో భార్యతో గొడవ జరిగింది. దీంతో ఆగ్రహించిన తండ్రి.. తన కుమారుడుని చంపేశాడు. రెండో భార్యతో తన సంసారం సాఫీగా సాగిపోయేందుకు వీలుగా ఏడేళ్ల పిల్లాడని చంపేశాడు. ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
ఇండోర్‌లోని తేజాజీ నగర్ ఏరియాలో ఉంటున్న శశిపాల్ ముండే (26) అనే వ్యక్తి మొదటి భార్య చనిపోయింది. మొదటి భార్య - శశిపాల్‌కు మూడేళ్ళ కుమారుడు ఉన్నాడు. భార్య చనిపోవడంతో శశిపాల్ ఇటీవల రెండో పెళ్లి చేసుకున్నాడు. అయితే, కొడుకును చూసుకునే విషయంలో ఆయన రెండో భార్యకు తరచూ గొడవలు జరుగుతున్నాయి. 
 
ఈ క్రమంలో పిల్లాడిని తాను చూసుకోలేనని చెప్పి శశిపాల్ రెండో భార్య తన పుట్టింటింకి వెళ్లిపోయింది. శశిపాల్ మొదటి భార్య కొడుకు ఉన్నంతవరకు తాను కాపురానికిరానంటూ తేల్చి చెప్పింది. దీంతో విసిగిపోయిన శశిపాల్.. కన్న కుమారుడిని కత్తితో పొడిచి చంపేశాడు. చుట్టుపక్కల వారు ఇచ్చిన సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి కేసు నమోదు చేసి పరారీలో ఉన్న శశిపాల్ కోసం గాలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments