Webdunia - Bharat's app for daily news and videos

Install App

అనుమానం పెనుభూతమైంది.. భార్యను నీటిలో ముంచి చంపేసిన భర్త

Webdunia
బుధవారం, 29 జూన్ 2022 (08:24 IST)
వారిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కానీ, వారిద్దరి అనుమానం పెనుభూతమైంది. చివరకు అది ఇద్దిర ప్రాణాలను బలితీసుకుంది. భార్యను నీళ్ల బకెట్‌లో ముంచి భర్త చంపేశాడు. ఆ తర్వాత తానుకూడా రైలుకిందపడి ప్రాణాలు తీసుకున్నాడు. 
 
హైదరాబాద్‌లోని పంజాగుట్ట డిటెక్టివ్‌ ఇన్‌స్పెక్టర్‌ నర్సింహరాజు వెల్లడించిన వివరాల మేరకు అస్సాంకు చెందిన మహానంద బిశ్వాస్‌(24), పంపా సర్కార్‌(22) అనే యువతీ యువకులు ప్రేమించుకున్నారు. ఏడాదిన్నర కిందట పెళ్లి చేసుకున్నారు. జీవనోపాధి నిమిత్తం కొన్నాళ్ల క్రితం హైదరాబాద్ నగరానికి వచ్చారు. 
 
తొలుత ఆదిభట్లలోని ఓ సంస్థలో సెక్యూరిటీ గార్డులుగా పనిచేశారు. తర్వాత పంజాగుట్ట సమీపంలోని ప్రేమ్‌నగర్‌లో అద్దె ఇంట్లో నివాసముంటూ బంజారాహిల్స్‌లోని ఓ ప్రముఖ మాల్‌లో కాపలాదారులుగా చేరారు. కొన్ని రోజులకే భార్య ప్రవర్తనపై మహానంద బిశ్వాస్‌ అనుమానం వచ్చింది. 
 
ఈ అంశంపై ఇద్దరూ తరచూ ఘర్షణ పడేవారు. సోమవారం మధ్యాహ్నం భార్య పంపా సర్కార్‌తో గొడవపడిన బిశ్వాస్‌ నిండుగా నీరున్న బకెట్‌లో ఆమె తల ముంచి హతమార్చాడు. గదికి తాళం వేసి లక్డీకాపుల్‌ రైల్వే స్టేషన్‌ సమీపంలోని వంతెన వద్ద రైలు కింద పడి బలవన్మరణానికి పాల్పడ్డాడు. అతడి వద్ద లభించిన పాకెట్‌ డైరీలో అస్సామీ భాషలో తన భార్యను చంపి, ఆత్మహత్యకు పాల్పడుతున్నానని రాసి ఉండటాన్ని రైల్వే పోలీసులు గుర్తించారు. 
 
ఇంటి చిరునామా సైతం ఉండటంతో పంజాగుట్ట పోలీసులకు సమాచారం అందించారు. మంగళవారం పంజాగుట్ట పోలీసులు వారి ఇంటి వద్దకు చేరుకొని తాళం పగులగొట్టి చూడగా.. పంపా సర్కార్‌ బకెట్‌లో మృతి చెంది ఉండటాన్ని గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

Siddu: జాక్ తో బొమ్మరిల్లు భాస్కర్ ట్రబుల్ లో పడ్డాడా?

Raviteja: మాస్ జాతర లో రవితేజ చిత్రం రీమిక్స్ థీమ్ విడుదల

థియేటర్లో నవ్వుతుంటే మా కడుపు నిండిపోయింది : ప్రదీప్ మాచిరాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments