యువతిని కలిసిన వ్యక్తిని బెదిరించి రూ.60 వేలు దోచుకున్న దుండుగులు..

ఠాగూర్
శుక్రవారం, 10 మే 2024 (10:34 IST)
డేటింగ్ యాప్ ద్వారా పరిచయమైన యువతిని కలిసిన వ్యక్తిని దుండగులు భయపెట్టి రూ.60 వేలతో పరారైన ఘటన ఒకటి ఫిల్మ్ నగర్‌ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగు చూసింది. పోలీసుల కథనం మేరకు.. విజయ్ నగర్ కాలనీకి చెందిన అజిత్ కె ఇమ్మాన్యుయెల్ ఈ నెల6వ తేదీన మసాజ్ రిపబ్లిక్ అనే డిటింగ్ యాప్ చూసి వాట్సాప్ దారా ఓ యువతితో చాటింగ్ చేశాడు. అదేరోజు సాయంత్రం గోల్గొండ ప్రాంతానికి యువతిని కలిసేందుకు కారులో వెళ్లాడు. ఆ తర్వాత ఇద్దరూ కారులో వెళ్దామనుకుంటుండగా ముగ్గురు వచ్చి కారులో ఎక్కారు. ఇంతలో యువతి జారుకుంది. 
 
మీరు వ్యభిచారానికి వచ్చారు.. కదా అంటూ అతడిని బెదిరించారు. పోలీసుల వద్దకు తీసుకెళ్తామని కేసులు నమోదు చేయిస్తామని, మీడియాకు తెలియజేసి బండారం బహిర్గతం చేస్తామంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. దీంతో భయపడిపోయిన ఆ జంట... తమను వదిలివేయాలంటూ ప్రాధేయపడటంతో రూ.లక్ష ఇవ్వాలని డిమాండ్ చేయడంతో ఇక చేసేదేం లేక తన బ్యాంకు ఖాతాలో ఉన్న రూ.60 వేల నగదును వారి క్యూఆర్ కోడ్‌కు స్కాన్ ద్వారా బదిలీ చేయించుకుని అతని కారులోనే మణికొండవైపు ప్రయాణించి రోడ్డు పక్కన ఆపి పరారయ్యారు. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దుండగుల కోసం గాలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గుంటూరు నగర నడిబొడ్డున స్టూడియోస్ 81

ఉగాది రోజు నుంచి సీతా పయనం మూవీ సన్ నెక్స్ట్‌లో స్ట్రీమింగ్

దర్శకులను సూపర్ స్టార్లు తొక్కేస్తున్నారు : కంగనా రనౌత్

Kiran: అప్పట్లో టీవీకి ఉన్న ప్రాధాన్యత నేపథ్యంగా తిమ్మరాజుపల్లి టీవీ తీశాం

గద్దర్ అవార్డ్స్ వేడుకలో గడబిడలు - నిర్వాహకులపై విమర్శలు ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టైప్ 2 మధుమేహుల కోసం డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ సెమాగ్లుటైడ్ ఇంజెక్షన్ ఒబెడా విడుదల

GLP-1 థెరపీకి వారానికి చికిత్స ఖర్చు రూ. 325 ఖర్చు, ఎలా?

జైడస్ బహుళ-మోతాదుల పెన్ పరికరంలో సెమాగ్లుటైడ్ ఇంజెక్షన్‌

ఎండు ద్రాక్షను తింటున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

కంటెంట్, వాణిజ్యాల సమ్మిళిత ప్రపంచంలో జీవిస్తున్నజెన్ ఆల్ఫా వెల్లడించిన ఏఎస్‌సీఐ అధ్యయనం

తర్వాతి కథనం
Show comments