యువతిని కలిసిన వ్యక్తిని బెదిరించి రూ.60 వేలు దోచుకున్న దుండుగులు..

ఠాగూర్
శుక్రవారం, 10 మే 2024 (10:34 IST)
డేటింగ్ యాప్ ద్వారా పరిచయమైన యువతిని కలిసిన వ్యక్తిని దుండగులు భయపెట్టి రూ.60 వేలతో పరారైన ఘటన ఒకటి ఫిల్మ్ నగర్‌ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగు చూసింది. పోలీసుల కథనం మేరకు.. విజయ్ నగర్ కాలనీకి చెందిన అజిత్ కె ఇమ్మాన్యుయెల్ ఈ నెల6వ తేదీన మసాజ్ రిపబ్లిక్ అనే డిటింగ్ యాప్ చూసి వాట్సాప్ దారా ఓ యువతితో చాటింగ్ చేశాడు. అదేరోజు సాయంత్రం గోల్గొండ ప్రాంతానికి యువతిని కలిసేందుకు కారులో వెళ్లాడు. ఆ తర్వాత ఇద్దరూ కారులో వెళ్దామనుకుంటుండగా ముగ్గురు వచ్చి కారులో ఎక్కారు. ఇంతలో యువతి జారుకుంది. 
 
మీరు వ్యభిచారానికి వచ్చారు.. కదా అంటూ అతడిని బెదిరించారు. పోలీసుల వద్దకు తీసుకెళ్తామని కేసులు నమోదు చేయిస్తామని, మీడియాకు తెలియజేసి బండారం బహిర్గతం చేస్తామంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. దీంతో భయపడిపోయిన ఆ జంట... తమను వదిలివేయాలంటూ ప్రాధేయపడటంతో రూ.లక్ష ఇవ్వాలని డిమాండ్ చేయడంతో ఇక చేసేదేం లేక తన బ్యాంకు ఖాతాలో ఉన్న రూ.60 వేల నగదును వారి క్యూఆర్ కోడ్‌కు స్కాన్ ద్వారా బదిలీ చేయించుకుని అతని కారులోనే మణికొండవైపు ప్రయాణించి రోడ్డు పక్కన ఆపి పరారయ్యారు. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దుండగుల కోసం గాలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెచ్యూర్డ్‌ అండ్‌ ఇన్‌స్పిరేషన్‌ స్టోరీతో రాబోతున్న సినిమా శ్రీ చిదంబరం గారు

టి గోపీచంద్, సంకల్ప్ రెడ్డి చిత్రం క్లైమాక్స్ షూటింగ్ ప్రారంభం

ఓం శాంతి శాంతి శాంతిః ట్రైలర్ ను అభినందించిన విజయ్ దేవరకొండ

Sharwanand: న్యూ ఏజ్ క్రైమ్ కామెడీ బా బా బ్లాక్ షీప్‌ టీజ‌ర్

Niharika Konidela: రాకాస గ్లింప్స్‌లో కామెడీ టైమింగ్‌తో మెప్పించిన సంగీత్ శోభన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో టీ తాగితే ఏమవుతుంది?

సెకండరీ గ్లకోమాకు విస్తృతమైన స్టెరాయిడ్ వాడకం కారణం: వైద్యులు

బొప్పాయి తింటే లాభాలతో పాటు నష్టాలు కూడా వున్నాయి, ఏంటవి?

ఈ సీజన్‌లో వింటర్ ఫ్లూ, న్యుమోనియాను దూరంగా ఉంచడానికి 5 ముఖ్యమైన చిట్కాలు

సెయింట్ లూయిస్‌లో నాట్స్ ఉచిత వైద్య శిబిరం

తర్వాతి కథనం
Show comments