Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదారాబాద్ మైనర్ బాలిక రేప్ కేసులో హోం మంత్రి మనవడు?

Webdunia
శనివారం, 4 జూన్ 2022 (13:46 IST)
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో ఓ కారులో మైనర్ బాలిక అత్యాచారానికి గురైంది. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఓ సంచలన విషయాన్ని గుర్తించారు. ఈ మైనర్ బాలిక అత్యాచారం కేసులో ఆ రాష్ట్ర హోం మంత్రి మహమూద్ అలీ మనవడు పుర్టాన్ అహ్మద్ ఉన్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. పుర్టాన్ అహ్మద్ తన స్నేహితులకు అమ్నేషియా పబ్‌లో బ్యాచిలర్ పార్టీ ఇచ్చారనే విషయం వెలుగులోకి వచ్చింది. 
 
అయితే, ఈ ఆరోపణలపై పుర్టాన్ అహ్మద్ తోసిపుచ్చాడు. తనకు ఆ గ్యాంగ్ రేప్‌కు ఎలాంటి సంబంధం లేదని చెప్పాడు. గ్యాంగ్ రేప్ జరిగినట్టుగా భావిస్తున్న రోజున తాను మినిస్టర్ క్వార్టర్స్‌లో ఉన్నానని వెల్లడించాడు. పైగా, తాను ఆ రోజు ఎవరికీ ఎలాంటి బ్యాచిలర్ పార్టీ ఇవ్వలేదని స్పష్టం చేశాడు. పార్టీలో పాల్గొన్నవారు, మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడినవారు ఎవరో తనకు తెలియదని చెప్పారు. అదేసమయంలో తనపై ఆరోపణలు చేసేవారు నిజానిజాలు తెలుసుకుని మాట్లాడాలని హితవు పలికారు. 
 
ఇదిలావుంటే ఈ కేసులో ఐదుగురు నిందితులను పోలీసులు గుర్తించారు. వారిలో ముగ్గురిని అరెస్టు చేయగా, వీరిలో ఇద్దరు మైనర్లు ఉండటం గమనార్హం. మరో ఇద్దరు నిందితుల కోసం గాలిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆరోగ్యంగా కులసాగానే ఉన్నాను .. రెగ్యులర్ చెకప్ కోసమే ఆస్పత్రికి వెళ్లా : ఉపేంద్ర క్లారిటీ

తెరచాప సినిమా కోసం ఆసుపత్రిపాలయ్యేవిధంగా కష్టపడ్డారు : 30 ఇయర్స్ పృద్వి

ఎఫ్1 వీకెండ్‌ మియామిలో రానా దగ్గుబాటి, లోకా లోకా క్రూ సందడి

తమిళ దర్శకుడిగా తెలుగు సినిమా చేయడం చాలా ఈజీ : డైరెక్టర్ కార్తీక్ రాజు

త్రిషకు పెళ్ళయిపోయిందా... భర్త ఆ యువ హీరోనా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం