Webdunia - Bharat's app for daily news and videos

Install App

దివ్యాంగురాలితో అక్రమ సంబంధం... పెళ్లి మాటెత్తగానే గొంతు నులిమి చంపేశారు..

Webdunia
శనివారం, 9 అక్టోబరు 2021 (11:30 IST)
హైదరాబాద్ నగరంలోని శంషాబాద్‌లో ఓ దారుణం జరిగింది. ఓ దివ్యాంగురాలు దారుణ హత్యకు గురైంది. ఈమెతో అక్రమ సంబంధం పెట్టుకున్న ఓ వ్యక్తి పెళ్లి మాటెత్తగానే గొంతునులిమి చంపేశాడు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, శంషాబాద్ మండలం ఉట్​పల్లి ఇంద్రారెడ్డి కాలనీకి చెందిన యాదమ్మ(35) అనే దివ్యాంగురాలు టైలరింగ్ చేసుకుంటూ జీవితాన్ని గడుపుతోంది. 
 
ఈమె గురువారం నిద్రపోయిన ఆమె శుక్రవారం ఉదయం పొద్దుపోయాక కూడా లేవలేదు. కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చి తలుపులు తీసి చూడగా మృతి చెంది ఉంది. వెంటనే  పోలీసులకు సమాచారం అందించి, అదే కాలనీకి చెందిన కృష్ణ యాదవ్‌ను అనుమానిస్తూ ఫిర్యాదు చేశారు. 
 
గత కొంతకాలంగా యాదమ్మకు, ఈయనకు అక్రమ సంబంధం కొనసాగిస్తూ తరచూ ఆమె ఇంటికి వచ్చేవాడని తెలిపారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు.. సీసీ కెమెరాల ఫుటేజీల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. కృష్ణయాదవ్ గురువారం అర్థరాత్రి యాదమ్మ ఇంటికి వెళ్లినట్టు సీసీ కెమెరాలో రికార్డైంది.
 
దీంతో అతడి​ని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. యాదమ్మ పెళ్లి చేసుకోవాలంటూ ఒత్తిడి తేవడంతోనే అడ్డు తొలగించుకోవాలని ఆమె ఇంటికెళ్లి గొంతు పిసికి హత్యచేసి ఆరు తులాల బంగారంతో పరారైనట్టు కృష్ణ యాదవ్ పోలీసులకు వాంగ్మూలం ఇచ్చాడు. దీంతో నిందితుడిని అరెస్టు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బిగ్ బాస్‌ ఇంట్లో మొదలైన ప్రేమ.. అమీర్‌ను పెళ్లాడనున్న పావని రెడ్డి

భారతీయ సినిమా కథల్లోకి హిందూయిజం, ఆధ్యాత్మికత ప్రవేశిస్తున్నాయా? ప్రత్యేక కథనం

మస్తాన్ సాయి వల్ల దర్గాకు అపవిత్రత... గవర్నర్‌కు లావణ్య లేఖ

రజనీకాంత్‌ కూలీలో అమితాబ్‌, నాగార్జున ఎంట్రీ షురూ !

కార్తీక్ ఆర్యన్‌తో గ్లామర్ డోస్ పెంచేసిన శ్రీలీల.. బాలీవుడ్‌లో హిట్టవుతుందా? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments