Webdunia - Bharat's app for daily news and videos

Install App

హుజురాబాద్ బైపోల్ : రూ.43 కోట్లతో టాప్‌లో జమున

Webdunia
శనివారం, 9 అక్టోబరు 2021 (11:12 IST)
తెలంగాణ రాష్ట్రంలోని హుజురాబాద్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు నామిషన్ల గడువు శుక్రవారంతో ముగిసింది. ఈ ఎన్నికల్లో విజయం కోసం ప్రభుత్వ, ప్రతిపక్షాలు సవాలుగా తీసుకున్నాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. 
 
ప్రధానపార్టీల తరపున పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో ఈటల దంపతులు అత్యధిక ధనవంతులుగా గుర్తింపు పొందారు. ఉపఎన్నిక నామినేషన్‌లో ఇచ్చిన అఫిడవిట్‌ ప్రకారం మొదటి స్థానంలో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌ సతీమణి జమున ఉండగా, ఆ తర్వాత స్థానంలో రాజేందరే ఉన్నారు. 
 
తర్వాతి స్థానాల్లో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి బల్మూరి వెంకట్, చివరిస్థానంలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌ నిలిచారు. అయితే, ప్రతి ఎన్నికలో ఈటల జమున సెంటిమెంట్‌ కోసం తన భర్త రాజేందర్‌ కంటే ముందు నామినేషన్‌ వేస్తుంటారు. రాజేందర్‌ బీజేపీ అభ్యర్థిగా పోటీలో నిలుస్తుండటంతో జమున నామినేషన్‌ను విత్‌డ్రా చేసుకోనున్నారు. 
 
జమున నామినేషన్‌ విత్‌డ్రా చేసుకుంటే ఈటల రాజేందర్‌ రూ.16.12 కోట్ల ఆస్తులతో హుజురాబాద్‌ నియోజకవర్గంలో పోటీచేస్తున్న అభ్యర్థుల్లో అత్యంత ధనవంతుడిగా నిలువనున్నారు. ధన ప్రవాహంతో జరుగనున్న ఈ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనేది ఈ నెల 30 తర్వాత తేలనుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Lavanya Tripathi: పెండ్లిచేసుకున్న భర్తను సతీ లీలావతి ఎందుకు కొడుతోంది ?

మళ్లీ వార్తల్లో నిలిచిన సినీ నటి కల్పిక.. సిగరెట్స్ ఏది రా.. అంటూ గొడవ

Cooli: నటీనటులతో రజనీకాంత్ కూలీ ట్రైలర్ అనౌన్స్ మెంట్ పోస్టర్ రిలీజ్

ANirudh: మనసులో భయం మరోపక్క మంచి సినిమా అనే ధైర్యం : విజయ్ దేవరకొండ

రజనీకాంత్ "కూలీ" నుంచి కీలక అప్‌డేట్... ట్రైలర్ రిలీజ్ ఎపుడంటే...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments