Webdunia - Bharat's app for daily news and videos

Install App

నార్సింగి‌లో తరగతి గదిలో విద్యార్థి ఆత్మహత్య

Webdunia
బుధవారం, 1 మార్చి 2023 (11:00 IST)
హైదరాబాద్ నగరంలోని నార్సింగ్‌లోని శ్రీ చైతన్య కాలేజీలో విషాదకర ఘటన జరిగింది. ఇక్కడ ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థి ఒకరు ఒత్తిడిని తట్టుకోలేక బలవన్మరణానికి పాల్పడ్డాడు. మృతుడిని ఎన్.సాత్విక్‌గా గుర్తించారు. మంగళవారం రాత్రి 10.30 గంటల సమయంలో తరగతి గదిలోనే ఈ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కాలేజీతో పాటు చదువుల్లో ఒత్తిడి వల్లే సాత్వికి ఆత్మహత్య చేసుకున్నట్టు సమాచారం. 
 
మరోవైపు, సూసైడ్ తర్వాత కాలేజీ యాజమాన్యం ప్రవర్తించిన తీరు ఇపుడు సర్వత్రా విమర్శలకు దారితీస్తుంది. సాత్విక్ ఉరేసుకున్నట్టు తెలిసినప్పటికీ కాలేజీ యాజమాన్యం ఏమాత్రం పట్టించుకోలేదని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. కనీసం ఆస్పత్రికి కూడా తరలించలేదని వారు పేర్కొంటున్నారు. 
 
చివరకు సాటి విద్యార్థులంతా కలిసి సాత్విక్‌ను కిందకు దించి, ఇతరుల ద్వారా వాహనం సాయం తీసుకుని ఆస్పత్రికి తరలించారు. అయితే, సాత్విక్‌ను ఆస్పత్రికి తరలించేలోపు ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని శవపరీక్ష నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మాల్దీవుల్లో కీర్తి సురేష్ రొమాంటిక్ వెకేషన్... భర్తతో కలిసి ఎంజాయ్...

Chinmayi: చిన్మయికి గంగై అమరన్ మద్దతు-సార్ ఆలోచించుకోండి.. సీఎం హౌస్ పక్కనే వుంది

మాల్దీవులకు బ్రాండ్ అంబాసిడర్‌గా కత్రినా కైఫ్

Ramya Pasupuleti : బికినీలో ఫిలిప్పీన్ బీచ్ లో రమ్య పసుపులేటి గ్లామర్ టీట్ చేస్తోంది

సయారా నుంచి జుబిన్ పాడిన రొమాంటిక్ ట్రాక్ బర్బాద్ విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

తర్వాతి కథనం
Show comments