Webdunia - Bharat's app for daily news and videos

Install App

మీటింగుల పేరుతో సీఈవో వక్రబుద్ధి... ఉద్యోగిని ఫిర్యాదు...

ఠాగూర్
ఆదివారం, 4 ఫిబ్రవరి 2024 (09:09 IST)
మీటింగుల పేరుతో ఓ సీఈవో తనలోని వక్రబుద్ధిని ప్రదర్శించాడు. అతని చేష్టలను భరించలేని ఓ ఉద్యోగిని నేరుగా పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటన హైదరాబాద్ నగరంలోని మధురానగర్ పోలీస్ స్టేషన్‌లో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. నగరానికి చెందిన ఓ యువతి అమీర్‌పేటలోని ఓ కంపెనీలో హెచ్ఆర్ అండ్ లీగల్ మేనేజరుగా పనిచేస్తుంది. అమెరికాలో అంటున్న ఏద కంపెనీ సీఈవో తొండెపుచంద్రతో జూమ్ మీటింగ్‌లో పాల్గొంటూ వచ్చేది. ఈ సమావేశాల్లోనే ఆయన అసభ్యంగా ప్రవర్తించసాగాడు. 
 
ఈ నేపథ్యంలో గత యేడాది డిసెంబరు నెలలో అమెరికా నుంచి నగరానికి చెందిన చంద్ర.. జనవరి నెల 23వ తేదీన అమీర్‌పేటలోని కార్యాలయంలో మీటింగ్ ఏర్పాటు చేయగా, ఆ యువతి పాల్గొంది. అపుడు ఆమెను వేధించాడు. జనవరి 2వ తేదీన నెక్లెస్ రోడ్డులోని ఓ రెస్టారెంట్‌కు పిలిపించి తన కోరిక తీర్చాలంటూ ఒత్తిడి చేయగా, అందుకు ఆమె నిరాకరించింది. పైగా, తన ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నట్టు ఈ-మెయిల్ ద్వారా సమాచారం ఇచ్చింది. జీతంతో పాటు ఇతర పత్రాలు ఇవ్వాలని కోరింది. కానీ, ఆమె కోరికను చంద్ర తిరస్కరించి, మళ్లీ వేధింపులకు పాల్పడ్డాడు. దీంతో ఆమె మధురానగర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ కేసు వెలుగులోకి వచ్చింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్ర‌భాస్ తో ఓ బాలీవుడ్ భామ‌ చేయనంటే.. మరో భామ గ్రీన్ సిగ్నల్ ?

UV క్రియేషన్స్ బ్రాండ్ కు చెడ్డపేరు తెస్తే సహించం

కల్ట్ క్లాసిక్‌లో చిరంజీవి, మహేష్ బాబు కలిసి అవకాశం పోయిందా !

రామాయణ: ది ఇంట్రడక్షన్ గ్లింప్స్‌ ప్రసాద్ మల్టీప్లెక్స్‌లోని PCX స్క్రీన్‌పై ప్రదర్శన

సినిమా పైరసీపై కఠిన చర్యలు తీసుకోబోతున్నాం : ఎఫ్.డి.సి చైర్మన్ దిల్ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: కాలిఫోర్నియా బాదంతో చర్మం చక్కదనం

Monsoon: వర్షాకాలంలో నిద్ర ముంచుకొస్తుందా? ఇవి పాటిస్తే మంచిది..

తర్వాతి కథనం
Show comments