Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐదేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడిన ముగ్గురు మైనర్లు

Webdunia
బుధవారం, 21 డిశెంబరు 2022 (15:40 IST)
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరం, సైదాబాద్‌లో ఐదేళ్ల బాలికపై ముగ్గురు మైనర్ కుర్రోళ్లు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ముగ్గురి వయసు 16, 11, 9 యేళ్లుగా ఉన్నాయి. వీరంతా కలిసి ఐదేళ్ల బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ దారుణం వివరాలను పరిశీలిస్తే, సైదాబాద్‌లో ఉంటున్న ఓ దంపతులకు ఆరు, ఐదేళ్ల వయస్సున్న ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. రోజూ ఉపాధి కోసం కూలీ పనులకు వెళ్లి సాయంత్రానికి ఇంటికి వస్తుంటారు. 
 
అలాగే, ఇద్దరు మైనర్ బాలికలు కూడా ఉదయం అంగన్ వాడీ కేంద్రానికి వెళ్లి మధ్యాహ్నానికి ఇంటికి వస్తుంటారు. ఈ క్రమంలో గత మూడు రోజులుగా పెద్దమ్మాయి జ్వరంతో బాధపడుతూ ఇంటిపట్టునే ఉంటుంది. చిన్నపాప ఒక్కతే అంగన్ వాడీ కేంద్రానికి వెళ్లి వచ్చేది. అయితే, ఆ పాప టీవీ చూసేందుకు పొరిగింటికి వెళ్లింది. ఆ సమయంలో ముగ్గురు మైనర్లు ఆ బాలికను భవనంమీదకు పిలిచి లైంగికదాడికి తెగబడ్డారు. 
 
ఆ తర్వాత ఆ బాలిక రోదిస్తూ ఇంటికి రాగా, తల్లి నిలదీయడంతో అసలు విషయం వెల్లడించింది. ఈ ఘటనపై బాధిత తల్లిదండ్రులు సైదాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలిక నుంచి స్టేట్మెంట్ తీసుకున్న పోలీసులు ముగ్గురు పోలీసులపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి జువైనల్ హోంకు తరలించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బిగ్ బాస్ సీజన్ 19: పహల్గామ్ దాడి బాధితురాలు హిమాన్షి నర్వాల్.. ఈ షోలో ఎంట్రీ ఇస్తారా?

పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా విజయ్ ఆంటోనీ భద్రకాళి డేట్ ఫిక్స్

మోతేవారి లవ్ స్టోరీ’ అద్వితీయ విజయం,3 రోజుల్లో ఆకర్షించిన బ్లాక్ బస్టర్ సిరీస్

దక్షిణాది సినిమాల్లో నటనకు, బాలీవుడ్ లో గ్లామరస్ కు పెద్దపీఠ : పూజా హెగ్డే

మెక్‌డోవెల్స్ సోడా బ్రాండ్ అంబాసిడర్ గా విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

Chapati Wheat Flour: ఫ్రిజ్‌లో చపాతీ పిండిని నిల్వ చేస్తే ఆరోగ్యానికి మేలు జరుగుతుందా?

మహిళలు వంకాయను తీసుకుంటే.. ఏంటి లాభం?

తర్వాతి కథనం
Show comments