భువనగిరిలో పరువు హత్య - ప్రేమ పెళ్లి చేసుకున్న హోంగార్డు హత్య

Webdunia
ఆదివారం, 17 ఏప్రియల్ 2022 (11:48 IST)
తెలంగాణ రాష్ట్రంలోని యాదాద్రి భువనగిరి జిల్లాలో పరువు హత్య జరిగింది. ప్రేమ వివాహం చేసుకున్న హోంగార్డు ఒకరు శవమై కనిపించారు. దీంతో వధువు తరపు బంధువులే ఈ హత్యకు పాల్పడివుంటారని మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మృతుడిని హోంగార్డు రామకృష్ణగా గుర్తించారు. 
 
ఈయన కొన్ని నెలల క్రితం ఓ యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం రామకృష్ణ కనిపించకుండా పోయారు. తాజాగా ఆయన శవమై కనిపించడంతో కుటుంబ సభ్యులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. అయితే, రామకృష్ణను ఎవరో కిడ్నాప్ చేసి హత్య చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 
 
కాగా, హోంగార్డుగా ఉన్న రామకృష్ణ విధుల నుంచి సస్పెండ్ అయ్యారు. అప్పటి నుంచి ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటున్నారు. రామకృష్ణ మామనే ట్రాప్ చేసి హత్య చేసినట్టు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. హోంగార్డు మృతదేహాన్ని సిద్ధిపేట వద్ద గుర్తించారు. ప్రస్తుతం ఈ హత్య జిల్లాలో సంచలనమైంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akhil Raj: అఖిల్ రాజ్ హీరోగా సతీష్ గోగాడ దర్శకత్వంలో అర్జునుడి గీతోపదేశం

Raashi Singh: త్రీ రోజెస్ సీజన్ 2 నుంచి లైఫ్ ఈజ్ ఎ గేమ్.. లిరికల్ సాంగ్

Suresh Babu: ఎమోసనల్‌ డ్రామా పతంగ్‌ చిత్రం : సురేష్‌బాబు

Anita Chowdhury: అంబాసిడర్ కారులో పదిమంది కుక్కేవారు : అనితా చౌదరి

మంచి ప్రేమ కథతో వస్తున్న లవ్ డేస్ పెద్ద విజయం సాధించాలి : సముద్ర

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్‌ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

తర్వాతి కథనం
Show comments