భువనగిరిలో పరువు హత్య - ప్రేమ పెళ్లి చేసుకున్న హోంగార్డు హత్య

Webdunia
ఆదివారం, 17 ఏప్రియల్ 2022 (11:48 IST)
తెలంగాణ రాష్ట్రంలోని యాదాద్రి భువనగిరి జిల్లాలో పరువు హత్య జరిగింది. ప్రేమ వివాహం చేసుకున్న హోంగార్డు ఒకరు శవమై కనిపించారు. దీంతో వధువు తరపు బంధువులే ఈ హత్యకు పాల్పడివుంటారని మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మృతుడిని హోంగార్డు రామకృష్ణగా గుర్తించారు. 
 
ఈయన కొన్ని నెలల క్రితం ఓ యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం రామకృష్ణ కనిపించకుండా పోయారు. తాజాగా ఆయన శవమై కనిపించడంతో కుటుంబ సభ్యులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. అయితే, రామకృష్ణను ఎవరో కిడ్నాప్ చేసి హత్య చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 
 
కాగా, హోంగార్డుగా ఉన్న రామకృష్ణ విధుల నుంచి సస్పెండ్ అయ్యారు. అప్పటి నుంచి ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటున్నారు. రామకృష్ణ మామనే ట్రాప్ చేసి హత్య చేసినట్టు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. హోంగార్డు మృతదేహాన్ని సిద్ధిపేట వద్ద గుర్తించారు. ప్రస్తుతం ఈ హత్య జిల్లాలో సంచలనమైంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సుస్మితా సేన్ ఓ డైమండ్ డిగ్గర్.. కెప్ట్ బాయ్‌ఫ్రెండ్‌లా ఉండేవాడిని: లలిత్ మోదీ

విజయ్ తర్వాత ధనుష్ రాజకీయాల్లోకి వస్తారా? కస్తూరి రాజా ఏమంటున్నారు?

ఫ్లాట్ బెల్లీ కోసం అష్టకష్టాలు పడ్డాను.. చివరికి పొట్ట కింది కొవ్వు వుంటే మంచిది గ్రహించాను

Nikhil: వియత్నాంలో యుద్ధ విన్యాసాలు నేర్చుకుని స్వయంభూ తో సిద్ధంగా వున్న నిఖిల్

Mahesh Babu : తెలుగు రాష్ట్రాలలో ఏకైక ఐమాక్స్ స్క్రీన్‌ను లాంచ్ చేయనున్న ఏఎంబీ సినిమాస్

తర్వాతి కథనం
Show comments