Webdunia - Bharat's app for daily news and videos

Install App

పదేళ్ల క్రితం పక్కింటి కుర్రోడితో పారిపోయిన కుమార్తె.. యూపీలో పరువు హత్య!!

ఠాగూర్
ఆదివారం, 12 జనవరి 2025 (15:39 IST)
పదేళ్ళ క్రితం పక్కింటి కుర్రోడితో తమ కుమార్తె పారిపోయింది. పెళ్లి చేసుకుని చెన్నైలో కాపురం పెట్టింది. ఈ జంటకు ఓ బిడ్డపుట్టింది. అయితే, తమ కుమార్తె లేచిపోయి పెళ్లి చేసుకోవడాన్ని జీర్ణించుకోలేని యువతి తండ్రి, సోదరుడు.. ఆ బిడ్డతో పాటు తమ వియ్యంకురాలిని హత్య చేశారు. ఈ దారుణ ఘటన ఉత్తర్రదేశ్ రాష్ట్రంలోని హయత్ నగర్‌లో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ పరువు హత్య కేసు వివరాలను పరిశీలిస్తే, 
 
గ్రామానికి చెందిన రామ్‌నాథ్, ప్రేమ్‌పాల్ అనే ఇద్దరూ ఒకే సామాజికవర్గానికి చెందిన వారు. పదేళ్ల క్రితం ప్రేమ్‌పాల్ కుమార్తె ఆశాదేవి రామ్‌నాథ్ కుమారుడు  విజయ్‌తో ఇంటి నుంచి పారిపోయి పెళ్లి చేసుకుని చెన్నైలో కాపురం పెట్టారు. కూలీపని చేసుకుంటూ హాయిగా జీవితాన్ని గడుపుతున్నారు. మూడేళ్ల క్రితం ఈ జంటకు కుమార్తె పుట్టగా కల్పన అనే పేరు పెట్టుకున్నారు. 
 
ఈ దంపతులిద్దరూ పని చేసుకుంటా తమ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. అయితే, కుమార్తెకు ఆరు నెలలు నిండగానే బిడ్డ ఆలనాపాలనా చూసుకునేందుకు నాయనమ్మ వద్ద అప్పగించారు. అప్పటి నుంచి ఆ బిడ్డ యూపీలోని హయత్ నగర్‌లో ఉండే నాయనమ్మ ఇంట ఉంటుంది. 
 
అయితే, పదేళ్ల క్రితం తమకుమార్తె ఆశాదేవి లేచిపోయి పెళ్లి చేసుకోవడాన్ని తల్లిదండ్రులు ఏమాత్రం జీర్ణించుకోలేక పోయారు. పదేళ్ల నుంచి తండ్రి రామ్ పాల్ పగతో రగిలిపోతూ వచ్చాడు. ఈ క్రమంలో రామ్ నాథ్ లేని సమయంలో ఆయన భార్య గీతాదేవిని, మనవరాలు కల్పనను ప్రేమ్ పాల్, ఆయన కుమారుడు కలిసి దారుణంగా హత్య చేశారు. కల్పన తనకూ మనవరాలేననే విషయం కూడా ప్రేమ్ పాల్ పట్టించుకోకుండా దారుణానికి పాల్పడ్డాడు. దీనిపై విజయ్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గెలుపోటములో సంబంధం లేకుండా నటిగా కొనసాగడం అద్రుష్టం : కేతిక శర్మ

మెగాస్టార్‌తో నటించాలా? రూ.18 కోట్లు ఇస్తేనే నటిస్తాను.. నయనతార

Varun Tej and Lavanya: గుడ్ న్యూస్- తల్లిదండ్రులం కాబోతున్న లావణ్య-వరుణ్

Trump's tariff: ట్రంప్ టారిఫ్ తెలుగు సినిమాకు లాభమా? నష్టమా?- ఛాంబర్ పెద్దలు ఏమంటున్నారు?

London: మైనపు విగ్రహ ఆవిష్కరణ కోసం లండన్ వెళ్ళిన రామ్ చరణ్ కుటుంబం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments