Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలికలను లైంగికంగా వేధించిన ప్రిన్సిపాల్ అరెస్టు

Webdunia
సోమవారం, 6 నవంబరు 2023 (11:11 IST)
తన వద్ద చదువుకునే పలువురు బాలబాలికలను వేధించిన వ్యవహారంలో ప్రభుత్వ కాలేజీ ప్రిన్సిపాల్‌ను పోలీసులు అరెస్టు చేశారు. రాజస్థాన్ రాష్ట్రంలోని జింద్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. ఈ కేసులో గత ఐదు రోజులుగా పరారీలో ఉన్న అతన్ని పోలీసుల ప్రత్యేక బృందం అరెస్టు చేసినట్టు డిప్యూటీ ఎస్పీ అమిత్ కుమార్ భాటియా వెల్లడించారు. అరెస్టు అనంతరం జింద్ జిల్లా కోర్టు ముందు హాజరుపరుస్తామని, తదుపరి విచారణ నిమిత్తం పోలీసుల రిమాండ్‌కు తీసుకుంటామని వెల్లడించారు. 
 
కాగా, ఇటీవల హర్యానా రాష్ట్ర మహిళా కమిషన్ జింద్ జిల్లాల్లోని ఓ ప్రభుత్వ పాఠశాలలో 50 మంది విద్యార్థినులపై ప్రిన్సిపాల్ లైంగికంగా వేధిస్తున్నట్టు ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పాఠశాలలోని 60 మంది విద్యార్థినులు కూడా తమకు లిఖితపూర్వక ఫిర్యాదు అందిందని చెప్పారు. 
 
వారిలో 50 మంది ప్రిన్సిపాల్ వేధిస్తున్నట్టు పేర్కొనగా మరో పది మంది అందుకు సాక్ష్యంగా రాశారని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ రేణు భాటియా వెల్లడించారు. ఫిర్యాదు మేరకు అందరూ మైనర్లేనని రేణు భాటియా తెలిపారు. ఈ ఘటన అనంతరం ప్రభుత్వం ప్రిన్సిపాల్‌ను సస్పెండ్ చేసింది. ఆ తర్వాత పోలీసులు అతనిపై కేసు నమోదు అరెస్టు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజేంద్ర ప్రసాద్ అన్నయ్య షష్టి పూర్తి చూడండి, బావుంటుంది : రవితేజ

ఒకవైపు సమంతకు రెండో పెళ్లి.. మరోవైపు చైతూ-శామ్ ఆ బిడ్డకు తల్లిదండ్రులు.. ఎలా?

Peddi : పెద్ది చిత్రం తాజా అప్ డేట్ - రామ్ చరణ్ పై కీలక సన్నివేశాల చిత్రీకరణ

థ్రిల్లర్ కథతో మలయాళ ప్రవింకూడు షప్పు- ప్రవింకూడు షప్పు సమీక్ష

ఆంజనేయ స్వామి దయతో మార్క్ శంకర్ ఇంటికొచ్చేసాడు : చిరంజీవి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం