Webdunia - Bharat's app for daily news and videos

Install App

పల్నాడు రొంపిచర్లలో వృద్ధురాలిపై అత్యాచారం

Webdunia
ఆదివారం, 14 ఆగస్టు 2022 (09:45 IST)
ఉమ్మడు గుంటూరు జిల్లాలోని పల్నాడు సమీపంలోని రొంపిచర్ల మండలంలో ఓ వృద్ధురాలిపై అత్యాచారం జరిగింది. ఆ తర్వాత బాధితురాలిని హత్య చేశాడు. విప్పర్లలో ఆరు బయట నిద్రిస్తుండగా ఈ దారుణం జరిగింది. అయితే, ఈ దారుణానికి పాల్పడిన కామాంధుడుని పోలీసు జాగిలాలు గుర్తించాయి.
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, రొంపిచర్ల మండలంలోని విప్పర్లకు చెందిన 65 యేళ్ల వృద్ధురాలు రోజులానే శుక్రవారం రాత్రి ఇంటిముందు ఆరుబయట నిద్రించింది. శనివారం ఉదయం పొద్దెక్కినా లేవకపోవడంతో వెళ్లి లేపేందుకు ప్రయత్నించగా అప్పటికే మృతి చెందినట్టు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. 
 
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆమె శరీరంపై గాయాలు ఉండడంతోపాటు దుస్తులు తొలగించి ఉండడంతో అత్యాచారం చేసి హత్య జరిగినట్టు అనుమానించారు. దీంతో పోలీస్ జాగిలాలతో తనిఖీ చేయించారు. 
 
శునకాలు అక్కడికి సమీపంలోనే ఉన్న పెరవలి మణికంఠ (27) ఇంట్లోకి వెళ్లడంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. విచారించగా తానే ఆమెపై అత్యాచారం చేసి హత్య చేసినట్టు అంగీకరించాడని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

షిర్డీ సాయిబాబా ఆలయాన్ని సందర్శించిన మోహన్ బాబు (video)

Prabhas: రాజా సాబ్ అందుకే ఆలస్యమవుతోందని తేల్చి చెప్పిన డైరెక్టర్ మారుతి

Tamannaah: గాడ్ వర్సెస్ ఈవిల్ ఫైట్ మరో స్థాయిలో ఓదెల 2 వుంటుంది : తమన్నా భాటియా

Pawan Kalyan: సింగపూర్ బయల్దేరిన చిరంజీవి, సురేఖ, పవన్ కళ్యాణ్

Modi: మార్క్ శంకర్ కోలుకుంటున్నాడు - మోదీ, చంద్రబాబుకు ధన్యవాదాలు : పవన్ కళ్యాణ్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments