Webdunia - Bharat's app for daily news and videos

Install App

"సారీ అమ్మా.. నిన్ను చంపేశాను.. నిన్ను కోల్పోతున్నాను.. ఓం శాంతి" : కన్నతల్లిని కడతేర్చిన కొడుకు!

ఠాగూర్
శనివారం, 31 ఆగస్టు 2024 (12:58 IST)
"సారీ అమ్మా.. నిన్ను చంపేశాను.. నిన్ను కోల్పోతున్నాను.. ఓం శాంతి" అంటూ కన్నతల్లిని ఓ కసాయి కొడుకు కడతేర్చాడు. ఈ దారుణం గుజరాత్ రాష్ట్రంలోని రాజ్‌కోట్‌లో వెలుగు చూసింది. ఇరుగుపొరుగు గుర్తించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. సమాచారం అందడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని నిందితుడిని అరెస్టు చేశారు. హత్యకు గురైన మహిళ పేరు జ్యోతిబెన్ గోసాయి అని, ఆమె వయసు 48 సంవత్సరాలని పోలీసులు వెల్లడించారు. తొలుత తన తల్లిపై కత్తితో దాడికి ప్రయత్నించానని, అయితే ఆమె కత్తిని లాక్కుందని, ఆ తర్వాత దుప్పటితో గొంతునులిమి ప్రాణాలు తీసినట్టు దర్యాప్తులో నీలేశ్ అంగీకరించాడని పోలీసులు వివరించారు. నేరానికి పాల్పడ్డ తర్వాత అతడు తల్లి డెడ్ బాడీ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశాడని తెలిపారు. 
 
ఈ ఫోటో కింద.. 'సారీ అమ్మ నేను నిన్ను చంపేశాను. నేను నిన్ను కోల్పోతున్నాను. ఓం శాంతి' అని పోస్ట్ పెట్టాడు. మరో పోస్ట్ పెట్టి 'ను మా అమ్మను చంపాను. నా జీవితాన్ని కోల్పోయాను. క్షమించు అమ్మ. ఓం శాంతి. మిస్ యూ అమ్మ' అని రాసుకొచ్చాడు. మరోవైపు, హత్యకుగురైన జ్యోతిబెన్ కొన్నేళ్లుగా తీవ్ర మానసిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్టు సమాచారం. ఆమెకు, కొడుకు నీలేశ్ మధ్య తరచూ ఘర్షణలు జరుగుతుండేవని, భౌతిక దాడులు కూడా చేసుకునేవారని ప్రాథమిక దర్యాప్తులో తెలిసిట్టు వెల్లడించారు. హత్యకు ముందు కూడా తల్లి, కొడుకు మధ్య ఘర్షణ జరిగిందని, తీవ్ర వాగ్వాదం కాస్తా నేరానికి దారితీసిందని వివరించారు.
 
మృతురాలు జ్యోతిబెన్ కు 20 ఏళ్ల క్రితం భర్త నుంచి విడిపోయారు. అప్పటి నుంచి నీలేశ్‌తో జీవించింది. భర్త, మిగతా పిల్లలు వీరితో సంబంధం లేకుండా దూరంగా వేరే చోట నివసిస్తున్నారు. మానసిక సమస్యలకు ఆమె చాలా కాలం నుంచి చికిత్స పొందుతోంది. అయితే గత నెల రోజుల నుంచి ఆమె మందులు వాడడం మానేసిందని, దీంతో ఆమె పరిస్థితి మరింత దిగజారిందని పోలీసులు అధికారి ఒకరు వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మా నాన్న సూపర్ హీరో' నుంచి నాన్న సాంగ్ రిలీజ్

తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులో 1960లో జరిగిన కథతో శర్వానంద్, సంపత్ నంది చిత్రం

జానీ మాస్టర్ ఇష్యూలో రాజకీయరంగు - మీడియాపై కేసుపెడతానన్న జానీమాస్టర్ భార్య అయేషా

జానీ మాస్టర్... మీరు దోషి అయితే... దానిని అంగీకరించండి : మంచు మనోజ్ ట్వసీట్

కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అరెస్టు.. స్పందించేందుకు నిరాకరించిన భార్య!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లో బెస్పోక్ టైలరింగ్, ఫైన్ క్లాతింగ్‌లో 100 ఏళ్ల వారసత్వం కలిగిన పిఎన్ రావు కార్యక్రమాలు

డిజైన్ డెమోక్రసీ 2024-డిజైన్, ఆర్ట్- ఇన్నోవేషన్ యొక్క భవిష్యత్తు

మెక్‌డొనాల్డ్స్ ఇండియా నుంచి మెక్‌క్రిస్పీ చికెన్ బర్గర్, క్రిస్పీ వెజ్జీ బర్గర్‌

మునగాకును ఉడకబెట్టిన నీటిని ప్రతిరోజూ ఉదయం తాగితే..

ఖాళీ కడుపుతో వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే?

తర్వాతి కథనం
Show comments