Webdunia - Bharat's app for daily news and videos

Install App

గూడూరులో దారుణం: కాలేజీకి వెళ్తున్న యువతిని కత్తితో బెదిరించి అత్యాచారం

ఐవీఆర్
గురువారం, 18 జులై 2024 (22:20 IST)
నెల్లూరు జిల్లా గూడురులో దారుణం జరిగింది. కాలేజీకి వెళ్తున్న యువతిని వినయ్ అనే రౌడీషీటర్ బెదిరించి ఆమెను బలవంతంగా ఆటోలో ఎక్కించుకుని తీసుకుని వెళ్లాడు. ఊరి బయట నిర్మాణంలో వున్న ఇళ్ల వద్దకు తీసుకుని వెళ్లి అక్కడ ఆమెపై అత్యాచారం చేసాడు.
 
నిందితుడు గత రెండేళ్లుగా తనను పెళ్లి చేసుకోవాలని బెదిరిస్తూ వస్తున్నాడు. అతడిని హెచ్చరించడంతో ఆమెను పట్టించుకోనట్లే వున్నాడు కానీ ఈరోజు ఆమె కాలేజీకి వెళ్తుండగా అడ్డగించాడు. బలవంతంగా ఆమెను ఆటోలో ఎక్కించుకుని తీసుకెళ్లి, తనను పెళ్లాడాలంటూ ఒత్తిడి చేసాడు. ఎంత బ్రతిమాలినా యువతి అంగీకరించకపోవడంతో ఆమెపై అత్యాచారం చేసాడు.
 
అవమానభారాన్ని తట్టుకోలేని బాధితురాలు ఇంటికి వచ్చి ఇంటిని శుభ్రపరిచే లైజాల్ లిక్విడ్ తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. కుటుంబ సభ్యులు గమనించి ఆమెను వెంటనే సమీప ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని అతడికి కఠిన శిక్ష విధిస్తామని చెప్పారు. యువతలో కొందరు మద్యపానం వంటి వ్యసనాలకు బానిసలై జీవితాలను నాశనం చేసుకుంటున్నారనీ, ఆడపిల్లల జోలికెళ్తే తీవ్రచర్యలు వుంటాయని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తప్పు చేసినట్టు నిరూపిస్తే నా భర్తను వదిలేస్తా : జానీ మాస్టర్ సతీమణి

మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర విజృంభణం ఆగమనం డేట్ ఫిక్స్

మా నాన్న సూపర్ హీరో' నుంచి నాన్న సాంగ్ రిలీజ్

తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులో 1960లో జరిగిన కథతో శర్వానంద్, సంపత్ నంది చిత్రం

జానీ మాస్టర్ ఇష్యూలో రాజకీయరంగు - మీడియాపై కేసుపెడతానన్న జానీమాస్టర్ భార్య అయేషా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ బ్యాలెన్స్ అవేర్‌నెస్ వీక్‌లో వెర్టిగో చక్కర్ అంటే ఏమిటో తెలుసుకుందాం

అధిక రక్తపోటు వున్నవారు దూరం పెట్టాల్సిన పదార్థాలు

హైదరాబాద్‌లో బెస్పోక్ టైలరింగ్, ఫైన్ క్లాతింగ్‌లో 100 ఏళ్ల వారసత్వం కలిగిన పిఎన్ రావు కార్యక్రమాలు

డిజైన్ డెమోక్రసీ 2024-డిజైన్, ఆర్ట్- ఇన్నోవేషన్ యొక్క భవిష్యత్తు

మెక్‌డొనాల్డ్స్ ఇండియా నుంచి మెక్‌క్రిస్పీ చికెన్ బర్గర్, క్రిస్పీ వెజ్జీ బర్గర్‌

తర్వాతి కథనం
Show comments