Webdunia - Bharat's app for daily news and videos

Install App

గూడూరులో దారుణం: కాలేజీకి వెళ్తున్న యువతిని కత్తితో బెదిరించి అత్యాచారం

ఐవీఆర్
గురువారం, 18 జులై 2024 (22:20 IST)
నెల్లూరు జిల్లా గూడురులో దారుణం జరిగింది. కాలేజీకి వెళ్తున్న యువతిని వినయ్ అనే రౌడీషీటర్ బెదిరించి ఆమెను బలవంతంగా ఆటోలో ఎక్కించుకుని తీసుకుని వెళ్లాడు. ఊరి బయట నిర్మాణంలో వున్న ఇళ్ల వద్దకు తీసుకుని వెళ్లి అక్కడ ఆమెపై అత్యాచారం చేసాడు.
 
నిందితుడు గత రెండేళ్లుగా తనను పెళ్లి చేసుకోవాలని బెదిరిస్తూ వస్తున్నాడు. అతడిని హెచ్చరించడంతో ఆమెను పట్టించుకోనట్లే వున్నాడు కానీ ఈరోజు ఆమె కాలేజీకి వెళ్తుండగా అడ్డగించాడు. బలవంతంగా ఆమెను ఆటోలో ఎక్కించుకుని తీసుకెళ్లి, తనను పెళ్లాడాలంటూ ఒత్తిడి చేసాడు. ఎంత బ్రతిమాలినా యువతి అంగీకరించకపోవడంతో ఆమెపై అత్యాచారం చేసాడు.
 
అవమానభారాన్ని తట్టుకోలేని బాధితురాలు ఇంటికి వచ్చి ఇంటిని శుభ్రపరిచే లైజాల్ లిక్విడ్ తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. కుటుంబ సభ్యులు గమనించి ఆమెను వెంటనే సమీప ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని అతడికి కఠిన శిక్ష విధిస్తామని చెప్పారు. యువతలో కొందరు మద్యపానం వంటి వ్యసనాలకు బానిసలై జీవితాలను నాశనం చేసుకుంటున్నారనీ, ఆడపిల్లల జోలికెళ్తే తీవ్రచర్యలు వుంటాయని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments