Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫిర్యాదు చేసేందుకు వచ్చిన దళిత బాలికపై పోలీసు అత్యాచారం.. ఎక్కడ?

Webdunia
బుధవారం, 27 సెప్టెంబరు 2023 (16:54 IST)
సమాజానికి రక్షణ కల్పించాల్సిన పోలీసులే కామాంధులుగా మారిపోతున్నారు. ఫిర్యాదు చేసేందుకు ఠాణాకు వచ్చిన ఓ దళిత మహిళపై కామంతో కళ్ళుమూసుకునిపోయిన పోలీసు అత్యాచారానికి తెగబడ్డాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో వెలుగు చూసింది. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
యూపీలోని ప్రయాగ్‌రాజ్‌కు చెందిన ఓ దళిత మహిళను కొందరు అకతాయిలు వేధింపులకు గురిచేస్తూ చంపేస్తామని బెదిరిస్తున్నారు. దీంతో వారిపై ఫిర్యాదు చేసేందుకు స్టేషన్‌కు వచ్చింది. ఆ సమయంలో ఠాణాలో ఉన్న ఎస్ఐ సుధీర్ కుమార్ పాండేకు తన బాధను వివరించింది. ఆ వెంటనే ఆయన నిందితులను అరెస్టు చేసేందుకు వెళదామని చెప్పి, బాధితురాలిని తన వాహనంలో ఎక్కించుకున్నాడు. అధికారి చెప్పిన మాటలు నమ్మిన అతనితోపాటు వెళ్లింది. దారిలో కారు ఆపి మత్తుమందు కలిపిన శీతలపానీయాన్ని ఆమెతో తాగించాడు. 
 
దీంతో ఆమె అపస్మారకస్థితిలోకి జారుకోవడంతో కారులోనే అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ స్పృహలోకి వచ్చిన బాధితురాలు తాను మోసపోయానని గ్రహించి సదరు పోలీసుపై ఫిర్యాదు చేసింది. దీంతో ఉన్నతాధికారులు ఆ కామాంధ ఎస్‌ఐను ఉద్యోగం నుంచి సస్పెండ్ చేశారు. పరారీలో ఉన్న ఎస్ఐ సుధీర్ కుమార్ పాండే కోసం గాలిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సమంత, చైతూ విడాకులపై నాగ్ ఏమైనా చెప్పారా? కేసీఆర్ ఏమయ్యారో?

అనుబంధాలకు పెద్ద పీట వేసిన చిట్టి పొట్టి చిత్రం రివ్యూ

సీరియస్ అయిన నాగార్జున.. కొండా సురేఖపై పరువు నష్టం దావా

జానీ మాస్టర్‌కు జాతీయ అవార్డా.. వద్దు రద్దు చేయండి..!

మట్కా టీజర్ విజయవాడ రాజ్ యువరాజ్ థియేటర్‌లో లాంచ్ కాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొలెస్ట్రాల్, అధిక రక్తపోటు తగ్గించే తులసి టీ, ఇంకా ఏమేమి ప్రయోజనాలు

హైదరాబాద్ సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్ అధునాతన లాపరోస్కోపిక్ సర్జరీతో రెండు అరుదైన సిజేరియన్ చికిత్సలు

పొద్దుతిరుగుడు నూనెను వాడేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఆంధ్రప్రదేశ్‌లో 7.7 శాతంకు చేరుకున్న డిమెన్షియా కేసులు

కుప్పింటాకా.. మజాకా.. మహిళలకు ఇది దివ్యౌషధం..

తర్వాతి కథనం
Show comments